కాలుష్య కోరల్లో ‘కోరింగ’
కోరింగ అభయారణ్యాన్ని కాలుష్యం ముప్పు వెంటాడుతోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విభిన్న జీవరాశులకు ఆవాసమైన ఈ ప్రాంతంతోపాటు మడ
డ్రెయిన్లలోకి శుద్ధి చేయని ఆక్వా వ్యర్థాలు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అతిక్రమణ
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, తాళ్లరేవు: కోరింగ అభయారణ్యాన్ని కాలుష్యం ముప్పు వెంటాడుతోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విభిన్న జీవరాశులకు ఆవాసమైన ఈ ప్రాంతంతోపాటు మడ అడవులకూ రక్షణ కరవవుతోంది. రొయ్యల శుద్ధి కేంద్రాల వ్యర్థాలను నేరుగా డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారు. మరోవైపు కొందరు నాటుసారా తయారీ స్థావరాలను నిర్వహిస్తూ పచ్చదనాన్ని ధ్వంసం చేస్తున్నారు.
వ్యర్థ జలాలతో ముప్పు
ఈ ప్రాంతంలో 19 రొయ్యల శుద్ధి యూనిట్లుంటే... వాటిలో పదింటికి అనుమతులే లేవు. రొయ్యల తలలు- వ్యర్థాలు కలిసిన ఈ నీరు పైపుల ద్వారా నేరుగా గోదావరి పాయలోకి వదలడంతో నీరంతా కలుషితం అవుతోంది. పైపులైన్లదీ అనధికార వ్యవహారమే. మరికొందరు రేకుల షెడ్లు, నివాసాల్లో రొయ్యలను శుద్ధిచేసి ఆ వ్యర్థాలు డ్రెయిన్లలోనే వదిలేస్తున్నారు. వీటి కారణంగా ఇక్కడి జీవ వైవిధ్యానికి భంగం కలుగుతోంది.
* తాళ్లరేవు మండలంలో అనుమతులున్న రొయ్యల, చేపల చెరువులు 3,358.46 ఎకరాల్లో ఉంటే.. అనుమతులు లేకుండా 2,514 ఎకరాల్లో తవ్వేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీటిపైనా చర్యలు తీసుకోవడంలేదు. చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ నుంచి 657 మంది అనుమతి పొందారని మత్స్య అధికారులు చెబుతున్నారు. ఈ చెరువులు 1,483 హెక్టార్లలో అభయారణ్యానికి ఆనుకుని, దాని చుట్టూ ఉన్నాయి. అనుమతులున్న కొన్ని యూనిట్లలోనూ అతిక్రమణలు సమస్యగా మారాయి.
* కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆక్వా వ్యర్థాలతో కలుషితం అవుతోందని పార్లమెంటుకు కాగ్ తాజాగా నివేదించింది. 11 ఆక్వా యూనిట్లు శుద్ధి చేయని వ్యర్థాలను డ్రెయిన్లు, నదిలోకి వదులుతున్నట్లు పేర్కొంది. అయినా... కీలక శాఖలు అతిక్రమణలపై కనీసం స్పందించలేదు. మడ అడవుల్లోకి 272 రకాల పక్షి జాతులు దేశ విదేశాల నుంచి వస్తుంటాయి. ఇక్కడ 610 రకాల మత్స్యజాతులు ఉన్నాయి. గోదావరి- సముద్రం కలిసే ముఖద్వారం వద్ద 300 రకాల చేపలున్నాయి. ఈ తీరానికి సముద్ర తాబేళ్లు ఏటా సంతానోత్పత్తికి డిసెంబరు-ఏప్రిల్లో వస్తాయి. ఇలాంటి కీలక మడ అడవుల్లోని పాయల్లోకి వేట కోసం వచ్చే మత్స్యకారులకు మినహా ఎవ్వరికీ అనుమతిలేదు. అయితే... నాటుసారా తయారీ కేంద్రాలు, తీరంలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై ఉక్కుపాదం మోపింది లేదు. ఏటా ఆయా పరిశ్రమల నుంచి రూ.7.3 లక్షలను పన్నుల రూపంలో వసూలు చేస్తున్న పంచాయతీకి కాలుష్య కట్టడిపై శ్రద్ధే లేదు.
అధికారులు ఏమంటున్నారంటే...
అనుమతులు లేని ఆక్వా చెరువులను గుర్తించి చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. కాలుష్యపై దృష్టిసారించాలని పీసీబీకి లేఖ రాశామని అటవీ శాఖ వైల్డ్లైఫ్ డీఎఫ్వో సెల్వం తెలిపారు. సమస్య తమ దృష్టికి రాలేదనీ.. పరిశీలిస్తామని పీసీబీ ఈఈ అశోక్ చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం