జోరువానలోనూ కర్షక హోరు
కాసేపు ఎండ.. మరి కాసేపు జోరు వాన.. స్వల్ప వ్యవధిలోనే వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా రాజధాని రైతుల దృఢసంకల్పంలో ఎలాంటి మార్పు లేదు.
రైతుల మహాపాదయాత్రకు ఊరూరా సంఘీభావాల వెల్లువ
హోరెత్తిన జై అమరావతి నినాదాలు
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే-ఉండి, ఆకివీడు, గణపవరం, ఉంగుటూరు: కాసేపు ఎండ.. మరి కాసేపు జోరు వాన.. స్వల్ప వ్యవధిలోనే వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా రాజధాని రైతుల దృఢసంకల్పంలో ఎలాంటి మార్పు లేదు. గోతులు, బురదమయమైన రహదారులపై అడుగులో అడుగేస్తూ.. జై అమరావతి అంటూ నినదిస్తూ వారు ముందుకు సాగారు. రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్ర బుధ, గురువారాల్లో ఏలూరు జిల్లా గణపవరం, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు, ఉండి, కాళ్ల మండలాల్లో సాగింది. బుధవారం పెంటపాడు మండలంలో మొదలైన యాత్ర జల్లికొమ్మెర నుంచి గణపవరం మండలంలో ప్రవేశించింది. ఆ రోజు సరిపల్లి వరకూ సాగి ముగిసింది. 25వ రోజు గురువారం సరిపల్లి నుంచి పెదఅమిరం వరకు రైతులకు గ్రామగ్రామాన జనం నీరాజనాలు పలికారు. జోరువానలోనూ మద్దతుగా సాగారు.
అమరావతి సాధించినప్పుడే నిజమైన పండగ
బుధవారం విజయదశమి అయినా రైతులు పాదయాత్రకు విరామం ఇవ్వలేదు. అమరావతి సాధించినప్పుడే తమకు నిజమైన పండగంటూ నినదించారు. కె.పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయంలో 101 దేవతలకు ప్రతీకగా 101 కలశాలతో పూజలు చేశారు. తామంతా నిజమైన రైతులమని ప్రమాణం చేశారు. తమను ఫేక్ రైతులు, రియల్ఎస్టేట్ వ్యాపారులంటూ అభాండాలు వేస్తున్న మంత్రులకు ఇదే మా సమాధానమంటూ నినదించారు. దసరా అయినా పెంటపాడులో యాత్రకు జనం భారీగా తరలివచ్చి బాణసంచా కాలుస్తూ స్వాగతించారు. కె.పెంటపాడు గ్రామస్థులు రహదారికి ఇరువైపులా మామిడి తోరణాలు, కొబ్బరాకులు కట్టి ఆవుదూడతో స్వాగతం పలికారు.
* పెంటపాడు మండలంలో యాత్ర మొదలై పెదఅమిరంలో ముగిసేవరకూ దశలవారీగా వర్షం పడుతూనే ఉంది. రహదారుల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆరేడు గ్రామంలో గుంతల్లో రైతులు వరి దుబ్బులు నాటారు. యాత్ర ఉండి మండలంలోకి ప్రవేశించాక దాదాపు వంద ట్రాక్టర్లతో చుట్టుపక్కల రైతులు ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఉండి మండలం కోలమూరు గ్రామస్థులు ట్యాంకర్తో పాలు తెచ్చి రైతులు వచ్చే మార్గంలో పోసి ఆహ్వానించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో వైకాపా కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
సంఘీభావాల వెల్లువ
బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆనందసూర్య ఆధ్వర్యంలో 30 మంది కమిటీ సభ్యులు విజయవాడ నుంచివచ్చి ఉండి వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరయ్యారు. బహుజన సంఘం, భారతీయ కిసాన్సంఘ్, తెలుగు రైతు, రాష్ట్ర రైతు సంఘం సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తెదేపా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు రామరాజు, రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, వేటుకూరి వెంకట శివరామరాజు, తెదేపా నేత బడేటి చంటి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తదితరులు యాత్రలో పాల్గొన్నారు.
25వ రోజు యాత్ర ఇలా..
* ప్రారంభం: ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి
* ముగింపు: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం
* నడిచిన దూరం: 15 కి.మీ.
అడుగడుగునా అగచాట్లు
పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఒక రోజు మండేఎండ కాస్తే, మరో రోజు జోరువానతో రైతులు తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటికే కాళ్లకు బొబ్బలెక్కాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా దారి పొడవునా అధ్వాన రహదారులు భయపెట్టిస్తున్నాయి. రాష్ట్రమంతటా బుధవారం దసరా పండగ చేసుకుంటే.. రైతులు మాత్రం కుటుంబాలకు దూరంగా యాత్రలో పాల్గొన్నారు. వర్షాలు కురుస్తుండడంతో భోజన సౌకర్యాలకూ అవస్థలు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..