Chemotherapy: ఆసుపత్రిలో చేరకుండానే కీమోథెరపీ.. నిమ్స్లో అందుబాటులోకి..
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పంజాగుట్ట నిమ్స్లో కీమో థెరపీ డే కేర్ కేంద్రం ఏర్పాటైంది. ఆసుపత్రిలో చేరకుండానే వైద్యం చేసేందుకు ఈ కేంద్రాన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈనాడు, హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పంజాగుట్ట నిమ్స్లో కీమో థెరపీ డే కేర్ కేంద్రం ఏర్పాటైంది. ఆసుపత్రిలో చేరకుండానే వైద్యం చేసేందుకు ఈ కేంద్రాన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ, జర్నలిస్టు ఆరోగ్య కార్డుదారులకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం కల్పించారు. గురువారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సదాశివుడు వెల్లడించారు. ఇప్పటివరకు క్యాన్సర్ రోగులకు ఒక్క రోజు కీమోథెరపీ చేయాల్సి వచ్చినా.. తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయి రోగి డిశ్చార్జి అయ్యే వరకు నాలుగైదు రోజులు కేటాయించాల్సి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సమయం వృథా అయ్యేది. ఈ కేంద్రం వల్ల త్వరగా సేవలందించేందుకు అవకాశం ఉంది. పేదలకు వేగంగా, ఉచితంగా కీమోథెరపీ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా 30 పడకలు ఏర్పాటుచేశామని సదాశివుడు పేర్కొన్నారు. దీంతో రోజుకు వంద మందికి ఇక్కడ చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదీ సంగతి!