East Godavari: చిన్నా... ఏవిరా నీ కాళ్లు
దర్శిత్... ఎంత చలాకీ పిల్లాడనీ... ఇల్లంతా కలియతిరుగుతూ తెగ సందడి చేసేవాడు... పిలవగానే పరిగేత్తుకుంటూ వచ్చి అమ్మ పక్కనే కూర్చుని... చీర కొంగును రెండు చేతుల్లోకీ తీసుకుని ముఖంపై కప్పుకొని దాగుడుమూతలు ఆడేవాడు.
జీవితాంతం తడి ఆరవు మా కళ్లు
విద్యుదాఘాతంతో కాళ్లు కోల్పోయిన కుమారుడు
తల్లిదండ్రులకు తీరని వేదన
మెరుగైన వైద్యం చేయించేందుకు పేదరికం అడ్డు
దర్శిత్... ఎంత చలాకీ పిల్లాడనీ... ఇల్లంతా కలియతిరుగుతూ తెగ సందడి చేసేవాడు... పిలవగానే పరిగేత్తుకుంటూ వచ్చి అమ్మ పక్కనే కూర్చుని... చీర కొంగును రెండు చేతుల్లోకీ తీసుకుని ముఖంపై కప్పుకొని దాగుడుమూతలు ఆడేవాడు. ఎంతో మురిపెంగా అమ్మ పెట్టే గోరుముద్దలు తిని.. ఆమె ఒడిలో పడుకుని నిద్రపోయేవాడు. హాయిగా సాగుతున్న జీవితం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ చిన్నోడి రెండు కాళ్లూ పోయాయి.
న్యూస్టుడే, తాళ్లపూడి: అమ్మ చేసిన ముస్తాబులో అందమంతా తనదే అనేలా వెలిగిపోయేవాడు ఆ బుడ్డోడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే... ఆ తల్లిదండ్రుల ఆనందం అంతాఇంతా కాదు. ముద్దుముద్దు మాటలు వింటూ మురిసిపోయేవారు. తమ కలలపంటను అల్లారుముద్దుగా పెంచి, ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. అంతలోనే కుమారుడికి కొండంత కష్టమొచ్చింది. చిన్నా... అని పిలవగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చే బుజ్జాయి ఇక నడవలేడని అమ్మానాన్నల గుండెలు పగిలిపోయాయి. బిడ్డతో పాటు తమ జీవితాలూ విద్యుదాఘాతం వల్ల తలకిందులయ్యాయంటూ ఆ దంపతులు రోదిస్తున్న తీరు హృదయాల్ని ద్రవింపజేస్తోంది... తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్ లారీ డ్రైవర్. భార్య చాందిని గృహిణి. పెద్ద కుమారుడు అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. రెండోకుమారుడు దర్శిత్కు మూడేళ్లు. ఈనెల 12న భవనంపై దుస్తులు ఆరేయడానికి తల్లితోపాటు దర్శిత్ కూడా వెళ్లాడు. ఆమె పనిలో నిమగ్నమై ఉండగా ఆ చిన్నారి అక్కడున్న 33కేవీ విద్యుత్తు తీగల సమీపానికి వెళ్లి, విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. అప్పటివరకు ఆడుకుంటున్న కుమారుడు పడిపోవడంతో చాందిని ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్కు తీసుకెళ్లారు.
మోకాళ్ల వరకు తొలగింపు
నాలుగు రోజుల చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ సోకడంతో బాలుడికి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు. కొన్ని రోజులు పరిశీలనలో ఉండాలని, ఇన్ఫెక్షన్ తగ్గకపోతే మోకాళ్లనూ తొలగించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తమ కుమారుడికి వచ్చిన కష్టం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చేతిలో చిల్లిగవ్వలేదు..
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం... కుమారుడి కోసం ఆసుపత్రి దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఉన్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి రూ.35 వేలకు పైగా ఖర్చు చేశారు. రోజూ మందులకే రూ.10 వేలకు పైగా అవుతోందని, ముందుముందు ఇంకెంత ఖర్చు అవుతుందో తెలియదని వాపోతున్నారు. మెరుగైన వైద్యం కోసం వేరేచోటకు తరలిస్తే రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని, తమ దగ్గర అంత మొత్తం లేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు.
పదేళ్ల నుంచి పోరాటం చేసినా..
పదేళ్ల క్రితం ఆ ఇంటిస్థానంలో పూరిపాక ఉండేది. అప్పుడు వద్దని మొత్తుకున్నా విద్యుత్తుశాఖ అధికారులు పాక మీదుగా 33 కేవీ విద్యుత్తు లైన్లు వేశారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మూడునెలల కిందట ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో సమస్యను హోంమంత్రి తానేటి వనితకు విన్నవించామని, అయినా పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు. అప్పుడే పట్టించుకుని ఉంటే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
వారం తర్వాత పరిశీలన.. ఘటన జరిగిన వారం తర్వాత విద్యుత్తు శాఖ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. 33 కేవీ లైన్లకు సంబంధించి విద్యుత్తు స్తంభాల ఎత్తు పెంచి ప్రమాద పరిస్థితిని లేకుండా చేస్తామని ఈఈ వీరభద్రరావు చెప్పారు. 33 కేవీ లైన్ పక్కనే 11 కేవీ లైన్ వెళ్తుండటంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విద్యుత్తు తీగలు మార్చేందుకు రుసుం చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. రోజు గడవడమే కష్టమైన తమకు, రుసుములు చెల్లించే ఆర్థిక స్తోమత లేదని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. మరో నాలుగైదు భవనాలపై నుంచీ విద్యుత్తు తీగలు వెళ్తున్నాయని, ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..