డిసెంబరులో తిరుపతి ఐఐటీకి రాష్ట్రపతి రాక

తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని ‘తిరుపతి ఐఐటీ’ శాశ్వత భవనాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించనుండటంతో భద్రతా ఏర్పాట్లను అధికారులు ఆదివారం పరిశీలించారు.

Published : 28 Nov 2022 03:25 IST

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని ‘తిరుపతి ఐఐటీ’ శాశ్వత భవనాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించనుండటంతో భద్రతా ఏర్పాట్లను అధికారులు ఆదివారం పరిశీలించారు. కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ఐఐటీకి చేరుకుని ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణతో చర్చించి, కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతన భవన సముదాయాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని