Andhra News: వైకాపా నేత బంధువుల లేఅవుట్లోకి భారీగా మట్టి తరలింపు
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో విజయనగరం-బౌడారా జాతీయ రహదారి-516కు సమీపంలో డి-ఫారం భూమిలో 20 రోజులుగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.
శృంగవరపుకోట, న్యూస్టుడే: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో విజయనగరం-బౌడారా జాతీయ రహదారి-516కు సమీపంలో డి-ఫారం భూమిలో 20 రోజులుగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎర్రచెరువును ఆనుకుని ఉన్న ఓ గిరిజనుడికి చెందిన భూమిలో సాగుతున్న ఈ దందా ట్రాక్టరు యజమానుల మధ్య వివాదంతో శనివారం వెలుగులోకి వచ్చింది. అది పోలీసుస్టేషనుకు చేరి, లోపలికి వెళ్లక ముందే స్థానిక నాయకులు రంగంలోకి దిగి రాజీ కుదిర్చారు. ఈ మట్టిని జిల్లాకు చెందిన ఉన్నత పదవిలో ఉన్న ఓ వైకాపా నేత బంధువులు ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 80 ఎకరాల్లో వేసిన లే-అవుట్కు తరలిస్తున్నట్లు సమాచారం. మట్టి కోసం గిరిజనుడికి చెందిన డి-ఫారం భూమిని కొన్నారు. ఈ తవ్వకాలకు అనుమతులు లేవని మండల అధికారి చెప్పడం విశేషం. ఇతరులైతే వాహనాలు సీజ్ చేసే అధికారులు భారీ స్థాయిలో జేసీబీలు, ట్రాక్టర్లతో తవ్వకాలు సాగిస్తుంటే చర్యలు తీసుకోకుండా చూస్తున్నారంటే వారిపై ఒత్తిళ్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఎస్ కోట తహసీల్దార్ శ్రీనివాసరావు ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ మట్టి తవ్వకాల గురించి తెలియగానే వీఆర్వోను పంపానని, అక్కడ వాహనాలేవీ లేవని చెప్పారని, ఆదివారం రెవెన్యూ ఇన్స్పెక్టరును పంపి విచారణ చేయిస్తామని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!