Andhra News: రూ.48,303 కోట్ల అప్పు తీసేసుకున్నాం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలు మిగిలి ఉండగానే బహిరంగ మార్కెట్ నుంచి రూ.48,303 కోట్ల రుణాలను సమీకరించేసింది.
తాజాగా రూ.వెయ్యి కోట్ల రుణం
ఇక రెండు నెలల్లో రూ.1,557 కోట్లకే అవకాశం
సొంత పన్నుల రాబడికి చేరువలో అప్పులు
ఇంకా రూ.2,200 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్లోనే..
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలు మిగిలి ఉండగానే బహిరంగ మార్కెట్ నుంచి రూ.48,303 కోట్ల రుణాలను సమీకరించేసింది. ఈ ఏడాది కేంద్రం మొత్తం రూ.49,860 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అవకాశమిచ్చింది. దీంతో ఇక మిగిలిన రెండు నెలలకు రూ.1,557 కోట్లే తీసుకునే అవకాశముంది. తాజాగా మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని రూ.వెయ్యి కోట్ల రుణాన్ని 12 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.69 శాతం వడ్డీకి తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బేవరేజస్ కార్పొరేషన్ నుంచి రూ.8,300 కోట్ల రుణం తీసుకుంది. అలాగే వివిధ కార్పొరేషన్ల నుంచి రూ.20వేల కోట్ల రుణాలను సమీకరించినట్లు అనధికారిక సమాచారం పేర్కొంటోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రుణాలు దాదాపు రూ.76వేల కోట్లకు మించిపోయినట్లు అనధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయినా ఇంకా రూ.2,200 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్లో రాష్ట్రం ఉండటం విశేషం. కార్పొరేషన్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తానికి గ్యారంటీలు ఇచ్చింది? ఎంత మొత్తం రుణాలు సమీకరించిందనే విషయాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం లేదు.
రాబడికి చేరువవుతున్న రుణాలు
రాష్ట్రంలో సొంత పన్నులు ఏ స్థాయిలో ఉన్నాయో.. దానికి చేరువగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులను సమీకరిస్తోంది. కాగ్ వెల్లడించిన లెక్కల ప్రకారం 2022 నవంబరు వరకు అంటే... 8 నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడి రూ.71,227.06 కోట్లుగా ఉంది. సగటున నెలకు రాష్ట్ర ప్రభుత్వ రాబడి రూ.8,903 కోట్లుగా ఉంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఆ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ రాబడి సుమారు రూ.89,033 కోట్లు ఉండొచ్చని సరాసరి లెక్కల ఆధారంగా అంచనా వేయవచ్చు. మరో పక్క తొలి 10 నెలల్లో రాష్ట్ర రుణ భారం దాదాపు రూ.76వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. నాబార్డు, కేంద్రం నుంచి అందేవి, ఇతర మరికొన్ని రుణాలు ఇందులో కలిపి లేవు.
ఈ వారంలో ఏకంగా రూ.5,000 కోట్ల కార్పొరేషన్ల రుణం
సంక్రాంతి పండగ వెళ్లిన తర్వాత కొన్ని ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి గ్యారంటీ ఇచ్చి దాదాపు రూ.5,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిసింది. జనవరిలో బహిరంగ మార్కెట్లో సమీకరించిన రూ.3000 కోట్ల రుణం కలిపితే.. ఇప్పటివరకూ రూ.8,000 కోట్లు తీసుకున్నట్లయింది. కేంద్రం నుంచి రూ.2,800 కోట్ల మొత్తం పన్నుల్లో వాటాగా వచ్చింది. అవి కాకుండా రోజుకు దాదాపు రూ.400 కోట్ల వరకు రాష్ట్ర రాబడి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే గడిచిన వారంలో దాదాపు రూ.10వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్