భూమాతకు తూట్లు... అక్రమార్కులకు రూ.కోట్లు!
నిబంధనలను తుంగలో తొక్కి... మట్టి తవ్వకాలతో అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు... ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించడం.. అడ్డుకుంటే దాడికి దిగడం.. ఎదురు కేసులు పెడతామని హెచ్చరించడం ఇదీ తీరు. అధికార పార్టీ నేత అండదండలతో మరింతగా చెలరేగిపోతున్నారు.
మట్టి మాటున విధ్వంసం
గుంటూరు జిల్లాలో పేట్రేగుతున్న మాఫియా
ఈనాడు, అమరావతి: నిబంధనలను తుంగలో తొక్కి... మట్టి తవ్వకాలతో అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు... ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించడం.. అడ్డుకుంటే దాడికి దిగడం.. ఎదురు కేసులు పెడతామని హెచ్చరించడం ఇదీ తీరు. అధికార పార్టీ నేత అండదండలతో మరింతగా చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో శేకూరు, శలపాడు, వీఎన్పాలెంలో లభిస్తున్న నాణ్యమైన ఎర్రమట్టికి విపరీతమైన డిమాండుంది. తవ్వకాలను వృత్తిగా మార్చుకున్న కొందరు మాఫియాగా ఎదిగారు. ప్రైవేటు భూములను ఎకరం రూ.40 లక్షలకు కొంటారు. అనుమతులు, రవాణా, అధికారులు రాకుండా లాబీయింగ్ కోసం ప్రజాప్రతినిధికి ముడుపులతోపాటు ఆదాయంలో వాటా ఇస్తారు. భూగర్భ గనులశాఖ నుంచి 6 మీటర్ల లోతు వరకు మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకుంటారు. భారీ యంత్రాల సాయంతో 100 అడుగులకుపైగా తవ్వేస్తున్నారు. అక్రమార్కుల అడ్డగోలు పనులకు భారీ గోతులు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ తవ్వకాల తీరుపై ‘ఈనాడు-ఈటీవీ’ పరిశీలనాత్మక కథనం ఇదీ..
చేబ్రోలు మండలంలో నాణ్యమైన ఎర్రమట్టి లభించడం స్థానికులకు శాపమైంది. తవ్వకాలవల్ల ఏర్పడిన భారీ గోతుల్లో వర్షపు నీరు నిలిచి వాటిలో పడి పశువులు చనిపోతున్నాయి. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. పొలాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. మట్టి తరలించే క్రమంలో సపోటా, మామిడి తోటలపై దుమ్ము పరచుకుని, పూత దెబ్బతిని ఆశించిన స్థాయిలో కాయలు కాయడం లేదంటూ రైతులు వాపోతున్నారు. మట్టిని తరలించే వాహనాల రాకపోకలవల్ల రహదారి పాడైంది. తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు ధర్నాకు దిగితే అధికార పార్టీ నేత పోలీసుల చేత దౌర్జన్యాలు చేయిస్తున్నారు. మట్టి లారీలను అడ్డుకోవాలని చూస్తే ఎదురుకేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు..
మట్టి తరలించే లారీలు నిబంధనల ప్రకారం 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకే రవాణా చేయాలి. ఒక్కో లారీలో 50 టన్నులకుపైగా మట్టి నింపి తరలిస్తున్నారు. దీంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. గనులశాఖకు క్యూబిక్ మీటరు మట్టికి పన్నులు కలిపి రూ.124 చెల్లించాలి. పర్మిట్లు తీసుకోకుండా మట్టి తరలిస్తూ గనులశాఖ ఆదాయానికి రూ.కోట్లలో గండికొడుతున్నారు. భూగర్భ గనులు, రెవెన్యూ, రవాణా, పర్యావరణ, పోలీసుశాఖలకు ఇదంతా తెలిసినా అధికార పార్టీ నేత కనుసన్నల్లో సాగుతున్నందున ఇటువైపు వచ్చే సాహసం చేయడం లేదు.
అమ్మాలని బెదిరిస్తున్నారు
నాకు పూర్వీకుల నుంచి వచ్చిన 80 సెంట్ల పొలం ఉంది. సపోటా తోట వేసుకుని జీవిస్తున్నా. మట్టి తవ్వకం కోసం భూమిని అమ్మాలని కొందరు బెదిరిస్తున్నారు. అమ్మేది లేదని చెప్పా. నీ పొలానికి నీళ్లు ఎలా వస్తాయో చూస్తామని హెచ్చరిస్తున్నారు. మా గ్రామాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఏం చేయాలనుకుంటున్నారు? ఊళ్లోవాళ్లు బతకాలా... వద్దా?
గాలి నిర్మల, శేకూరు, చేబ్రోలు మండలం
పంటలు నష్టపోతున్నాం
రాత్రీపగలూ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. మురుగునీటి కాలువ కట్టపై భారీ లారీలు తిరగడంవల్ల అది దెబ్బతింది. ఆ కట్ట తెగితే మా పొలాలు మునుగుతాయి. పంటలకు పూత, కాత వచ్చినా ధూళి పడి కాయలు చేతికి రావడం లేదు. బోరుబావులు ఎండి అవస్థలు పడుతున్నాం.
మైలా వెంకటరామరాజు, శలపాడు
ఫిర్యాదు చేసినా నిరుపయోగం
అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. భారీ తవ్వకాలవల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. మట్టి తవ్వకాలతో గాలిలో దుమ్మూధూళి చేరి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వశాఖలు స్పందించకపోవడం దారుణం.
వీరంకి రంగారావు, విశ్రాంత జియాలజిస్టు, వడ్లమూడి
నివేదిక వచ్చాక చర్యలు
స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు... చేబ్రోలు మండలంలో మట్టి తవ్వకాల్లో లీజులు, నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెనాలి సబ్కలెక్టర్ను ఆదేశించాం. నివేదిక వచ్చాక అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
వేణుగోపాల్రెడ్డి, కలెక్టర్, గుంటూరు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక