రూ. 1.10 లక్షల కోట్లతో ఎన్టీపీసీ పార్కు
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అండగా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసి.. కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్ఐపీబీ సమావేశంలో పలు పరిశ్రమలకు ఆమోదం
పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలన్న సీఎం
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అండగా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసి.. కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం మంగళవారం తాడేపల్లిలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘విద్యుత్ ప్రాజెక్టుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చింది. వాటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కంపెనీ తీసుకునే భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31 వేలను లీజు కింద రైతుకు చెల్లిస్తుంది. మెగావాట్కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి వస్తుంది. జీఎస్టీ రూపేణా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది’’ అని పేర్కొన్నారు. ఆమోదించిన పరిశ్రమల వివరాలు..
* అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ హైడ్రోజన్ సంబంధిత ఇంధనాలను ఉత్పత్తి చేసే న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ఆమోదం. మొదటి విడత రూ. 55 వేల కోట్లు, రెండో విడత మరో రూ. 55 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. మొదటి విడత 2027 నాటికి, రెండో విడత 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం. రెండు విడతల్లో 61 వేల మందికి ఉపాధి.
* కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అవిశా ఫుడ్స్ సంస్థ రూ. 498.84 కోట్ల పెట్టుబడితో రోజుకు 500 కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇథనాల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు. ఈ ఏడాది జూన్లో పనులు ప్రారంభించి ఏడాది లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. గతంలో ఇదే సంస్థకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. వల్లభనేని అఖిల్, వల్లభనేని అరుణ్శౌరి, వల్లభనేని అనుదీప్లు సంస్థ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
* కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ రూ. 3,400 కోట్ల పెట్టుబడులతో విస్తరణ. 2025 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం. 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి.
* శ్రీకాళహస్తిలో రూ. 915.43 కోట్లు, పుంగనూరులో రూ. 171.96 కోట్ల పెట్టుబడులతో డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,350 మందికి ఉపాధి.
* రామాయపట్నంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో కాపర్ క్యాథోడ్, కాపర్ రాడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న అక్టార్ గ్రూప్ ఫ్యాక్టరీ. 2023 మేలో ప్రారంభించి. 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి.
* కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 1000 మెగావాట్ల పవన, 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా నాలుగు విడతల్లో రూ. 10,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా. 2027 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం. 2 వేల మందికి ఉపాధి. పల్లవి చనుమోలు, లక్ష్మీప్రసాద్ యెర్నేని సంస్థ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
* టెలి కమ్యూనికేషన్ ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమను రూ. 1,489.23 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలిపిన వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా. 15 వేలమందికి ఉపాధి.
* రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించిన నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్కోట దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ సంస్థ సేకరించిన 985 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం.
* భోగాపురంలో 90 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు ఆమోదం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి అత్యాధునిక సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశం.
విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న వైజాగ్ టెక్ పార్కు. మొదటి విడతలో 10 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు. మూడేళ్లలో రూ. 7,210 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 14,825 మంది, పరోక్షంగా 5,625 మందికి ఉపాధి. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్కు ఇది అదనం. ఈ సంస్థ డైరెక్టర్లుగా నవనీత్ ద్వారకాప్రసాద్, సంజయ్ భూటాని, షామిక్ పంకజ్భాయ్ పారిక్ వ్యవహరిస్తున్నారు. అదానీ కార్పొరేట్ కార్యాలయం, శాంతిగ్రామ్, వైష్ణోదేవి సర్కిల్ దగ్గర, అహ్మదాబాద్ అనే అడ్రస్తో కంపెనీ రిజిస్ట్రేషన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్