EPFO - Higher pension: పింఛనుదారులకు ఈపీఎఫ్వో షాక్
దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్వో) షాక్ ఇచ్చింది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది.
అధిక పింఛను లబ్ధిదారులు పేరా 26(6), 11(3) ఆప్షన్ కాపీలు వారంలోపు ఇవ్వాలంటూ నోటీసులు
లేకుంటే అధికంగా చెల్లించిన మొత్తం వసూలు చేస్తామని వెల్లడి
2014కు ముందు పదవీ విరమణ చేసిన వారిలో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్వో) షాక్ ఇచ్చింది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. సర్వీసులో ఉన్నప్పుడు అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు పేరా 26(6) కింద, పింఛను నిధికి 8.33శాతం వాటా చెల్లించేందుకు పేరా 11(3) కింద యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారాలను అందజేయాలని సూచించింది. వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించకుంటే ఇప్పటివరకు చెల్లింపులు చేసిన అధిక పింఛను మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2015 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పింఛనుకు అర్హత పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50వేల మంది వరకు ఈ తరహా పింఛనుదారులు ఉంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
ఆప్షన్ ఇవ్వలేదని...
ఈపీఎఫ్ చట్టం ప్రకారం 2014 నాటి సవరణకు ముందు అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎఫ్ చందా చెల్లించినప్పటికీ, ఉద్యోగి పింఛను పథకం (ఈపీఎస్)లో చేరేందుకు వేతనం మొత్తంపై 8.33 శాతం జమ చేసేలా యజమానితో కలిసి పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు. చట్టసవరణ నాటికి ఉమ్మడి ఆప్షన్పై గడువు లేదని, పింఛను పథకం సవరించిన తరువాత ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని 2015 ఆర్సీ గుప్తా కేసులో చందాదారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉమ్మడి ఆప్షన్కు స్పష్టమైన గడువు పేర్కొననందున, 2014 సెప్టెంబరుకు ముందు పదవీవిరమణ చేసి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా కట్టిన వారికి అధిక పింఛను పొందేందుకు అవకాశమివ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ తీర్పుమేరకు 2017లో ఈపీఎఫ్వో ప్రత్యేక సర్క్యులర్ ద్వారా అధిక వేతనంపై చందా కడుతున్నవారి నుంచి ఆప్షన్ తీసుకుని, ఆ మేరకు అదనపు ఈపీఎస్ నిధిని చందాదారు నుంచి సమీకరించి అధిక పింఛను మంజూరు చేసింది. ప్రస్తుతం 2022 సుప్రీంకోర్టు తీర్పులో 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు పదవీవిరమణ పొందినవారు.. అంతకుముందే ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుంటే అధిక పింఛను వర్తించదని పేర్కొంది. ఈ తీర్పు మేరకు ఈపీఎఫ్వో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. 2014 సెప్టెంబరు 1కి ముందు ఆప్షన్ ఇచ్చిన వారికి మాత్రమే అధిక పింఛను మంజూరు చేస్తామని తెలిపింది. పింఛను పథకం సవరణకు ముందుగా (2014 సెప్టెంబరు1) పదవీ విరమణ చేసిన ఉద్యోగులు.. ఆ పథకం నుంచి వైదొలిగినట్లేనని, అప్పటికే వారంతా యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వనందున సుప్రీంకోర్టు తీర్పు కాపీ పేరా నం 44(5) ప్రకారం అధిక పింఛనుకు అనర్హులని తెలిపింది.
రికవరీ కోసం ప్రత్యేక విభాగం...
2015 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛను పొందిన వారికి ఇప్పుడు ‘అధికాన్ని’ రద్దు చేస్తూ.. ఆ మేరకు బకాయిలు రికవరీ చేయాలని ఈపీఎఫ్వో నిర్ణయించింది. ఇందుకోసం ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జనవరిలో ఈపీఎఫ్వో సర్క్యులర్ జారీ చేసిన వెంటనే అధిక పింఛను పొందుతున్నవారి జాబితాలు సిద్ధం చేసి నోటీసులు జారీ చేస్తోంది. నోటీసులు అందుకున్న తేదీ నుంచి వారం రోజుల్లోగా.. పేరా 26(6), పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్కు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఆధారాలు సమర్పిస్తే అధిక పింఛను విషయాన్ని పరిశీలిస్తామని, ఆధారాలు ఇవ్వకుంటే ఇప్పటివరకు జమ చేసిన అధిక పింఛను బకాయిలు రికవరీ చేయడంతో పాటు పాతపింఛను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఈ నోటీసులు అందుకున్న పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరిపై బకాయిల భారం కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి మొదలవుతుందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మందికిపైగా ఈ తరహా నోటీసులు అందుకున్నారు.
ఒక ఉదాహరణ ఇదీ..
హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ (71) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ 2011లో పదవీ విరమణ చేశారు. అప్పటికి ఆయన వేతనం (బేసిక్+డీఏ) రూ.16,200. ఆ సంస్థ ఆయన పొందుతున్న వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించింది. ఆయన పదవీ విరమణ చేసే నాటికి ఈపీఎఫ్వో గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉండటంతో ఆ వేతనంపై ఆయనకు రూ.1982 పింఛను మంజూరైంది. అయితే ఆ ఉద్యోగి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించినందున, 2015 ఆర్సీగుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛను ఇవ్వాలంటూ యజమానితో కలిసి 2017లో ఉమ్మడి ఆప్షన్ ఇస్తూ దరఖాస్తు చేశారు. దానిని పరిశీలించిన ఈపీఎఫ్వో అధిక వేతనంపై 8.33 శాతం చొప్పున ఉద్యోగి పింఛను పథకాని (ఈపీఎస్)కి రూ.2.8 లక్షలు కట్టాలని డిమాండ్ నోటీసు జారీచేసింది. దీంతో ఉద్యోగి అంత మొత్తం జమచేశారు. అధిక వేతనం (రూ.16,200)పై పింఛను రూ.6,400గా ఖరారైంది. అప్పటివరకూ పింఛను బకాయిల కింద రూ.3.8 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం 2022 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. శ్రీనివాస్కు అధిక పింఛను వర్తించదని ఈపీఎఫ్వో పేర్కొంది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని లేకుంటే బకాయిలు రికవరీ చేస్తామని రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని