మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెల్లడించింది.

Updated : 26 Apr 2024 05:46 IST

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలుగా ఇవి జరుగుతాయి. నైతికత, మానవ విలువల పరీక్ష జూన్‌ 6న, పర్యావరణ విద్య 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని