‘నేరస్థుల గుండెల్లో..’ గూగుల్ టేక్అవుట్
‘మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు కొన్ని గంటల ముందు (2019 మార్చి 14న సాయంత్రం 6.14 గంటల నుంచి 6.33 వరకూ) నిందితుడు సునీల్యాదవ్ కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్రెడ్డిల ఇంట్లోనే ఉన్నాడు.
సెకన్లతో సహా నిందితుల చరిత్రను అందిస్తున్న సాంకేతికత
వివేకా హత్య కేసు విచారణలో కీలకంగా ఈ ఆధారాలు
ఈనాడు, అమరావతి
* ‘మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు కొన్ని గంటల ముందు (2019 మార్చి 14న సాయంత్రం 6.14 గంటల నుంచి 6.33 వరకూ) నిందితుడు సునీల్యాదవ్ కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్రెడ్డిల ఇంట్లోనే ఉన్నాడు. వివేకాను చంపేందుకు గొడ్డలి కొనటానికి కదిరి వెళ్లిన షేక్ దస్తగిరి రాక కోసం అవినాష్రెడ్డి ఇంట్లో నిరీక్షించాడు. అతను అక్కడ ఉన్నప్పుడే సాయంత్రం 6.22 గంటల సమయంలో మరో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సునీల్యాదవ్కు రెండు సార్లు కాల్ చేసి మాట్లాడారు.’
* ‘2019 మార్చి 14న రాత్రి 11.45 గంటలకు సునీల్యాదవ్, షేక్ దస్తగిరి వివేకా ఇంటి సమీపంలోనే ఉన్నారు. అర్ధరాత్రి 1.30 వరకూ అక్కడే మాటు వేశారు.’
* ‘వివేకా హత్య అనంతరం 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు ఎంపీ అవినాష్రెడ్డి సన్నిహితుడైన గజ్జల ఉదయ్కుమార్రెడ్డి ఎంపీ ఇంటి వద్ద ఉన్నాడు. ఆ తర్వాత కేవలం 2 నిమిషాల వ్యవధిలో అంటే 6.27 గంటలకు వివేకానందరెడ్డి ఇంటి బయట ఉన్నాడు. 6.29 నుంచి 6.31 గంటల మధ్య వివేకా ఇంటి లోపల గడిపాడు.’
* వివేకా హత్య కేసులోని నిందితులు ఘటన జరిగిన రోజు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో తెలిపే ఈ వివరాలను సీబీఐ ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది. నిమిషాలు, సెకన్లతో సహా వివరాలను సీబీఐ ఎలా సేకరించింది. సాంకేతిక ఆధారాలు, వాటి శాస్త్రీయతను ఎలా నిర్ధారించింది? అనే ప్రశ్నలకు వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం ‘‘గూగుల్ టేక్ అవుట్’’. అసలేంటీ సాంకేతికత? దర్యాప్తు సంస్థలు దీన్ని వినియోగించుకుంటున్నాయి? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.
ఫోన్లో గూగుల్ ఖాతా ఉంటే చాలు
ఫోన్లోని గూగుల్ ఖాతాలో నిక్షిప్తమైన మొత్తం డేటాను జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ క్యాలెండర్ సహా మొత్తం 48 రకాల గూగుల్ సేవలతో డౌన్లోడ్ చేసుకునేందుకు, బదలాయించుకునేందుకు వీలు కల్పించే డేటా ఎక్స్పోర్ట్ సర్వీస్ టూలే.. గూగుల్ టేక్అవుట్. నేరాల ఛేదనలో దర్యాప్తు సంస్థలకు ఈ టూల్ కీలకంగా ఉపయోగపడుతోంది. అనుమానితులు, నిందితులు గూగుల్ ఖాతాకు సంబంధించిన డేటాను పొందటానికి, సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని గుర్తించటానికి, వారి ప్రమేయాన్ని తేల్చటానికి ఇది గొప్ప సాధనంగా మారింది. న్యాయస్థానంలోనూ దీన్ని ఒక ఆధారంగా సమర్పించొచ్చు.
నేరాల గుట్టు రట్టు చేయొచ్చు
* సామాజిక మాధ్యమాల ద్వారా వేధిస్తున్న వారి ఫోన్ నుంచి సందేశాలు, గూగుల్ యాక్టివిటీ వంటివన్నీ గూగుల్ టేక్అవుట్ ద్వారా దర్యాప్తు అధికారులు తీసుకుని నేర నిరూపణకు ఆధారాలుగా ఉపయోగించొచ్చు.
* ఆర్థిక నేరాల దర్యాప్తులోనూ గూగుల్ టేక్అవుట్ ఎంతో కీలకం. నిందితులు, అనుమానితులకు సంబంధించిన స్ప్రెడ్ షీట్లు, డాక్యుమెంట్లు, జీమెయిల్ ద్వారా పంపించిన మెయిళ్లు వంటి వాటిని తీసుకుని వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లొచ్చు.
వివేకా హత్య కేసులో ఇలా ఉపయోగించారు
వివేకా హత్య కేసులోనూ సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, ఉదయ్ కుమార్రెడ్డిలకు సంబంధించిన కదలికలను గూగుల్ టేక్అవుట్ ద్వారానే సీబీఐ అధికారులు తీసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి నిర్ధారించుకున్నారు. దర్యాప్తులో అధికారులు గుర్తించిన అంశాలు, శాస్త్రీయ ఆధారాలతో పోల్చుకొని నిందితులను ప్రశ్నిస్తున్నారు.
ఎలా కీలకం అంటే?
గూగుల్ టేక్అవుట్ ద్వారా దర్యాప్తు సంస్థలు చట్టపరమైన అనుమతులు తీసుకుని నిందితుల జీమెయిల్ ఖాతా నుంచి పంపిన, వారికి వచ్చిన సందేశాలు, డ్రాఫ్ట్లు, తొలగించిన సందేశాలూ పొందొచ్చు.
‘గూగుల్ డ్రైవ్’లో సేవ్ చేసిన అన్ని రకాల ఫైల్స్ తీసుకోవచ్చు.
‘గూగుల్ సెర్చ్ హిస్టరీ’ ద్వారా అనుమానితులు ఏయే అంశాల కోసం, ఏయే సమయాల్లో గూగుల్లో వెతికారో తెలుసుకోవచ్చు.
‘గూగుల్ క్యాలెండర్ ఈవెంట్స్’ ఆధారంగా వారు అంతకు ముందు హాజరైన కార్యక్రమాలు, వాటి లొకేషన్స్ వివరాలు, భవిష్యత్తులో హాజరుకావాలని నిర్ణయించుకున్న ఈవెంట్స్, లొకేషన్స్ వివరాలు పొందొచ్చు.
‘గూగుల్ మ్యాప్ లొకేషన్ హిస్టరీ’ ద్వారా నిందితులు ఏ సమయంలో ఎక్కడున్నారు. అక్కడ ఎంత సమయం గడిపారో పొందొచ్చు. ఇతర గూగుల్ సర్వీసెస్తో ఆ వివరాల్నీ సరిపోల్చుకోవచ్చు.
ఇలా సేకరించిన బ్యాకప్ డేటాను విశ్లేషిస్తే నిందితుల ప్రతి కదలిక, చర్యలకు సంబంధించిన సమాచారం పక్కాగా లభిస్తుంది. అప్పటికే దర్యాప్తులో గుర్తించిన విషయాలను ఈ సమాచారంతో పోల్చుకొని నిందితుల్ని ప్రశ్నించేందుకు ఉపకరిస్తుంది. సెల్ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేస్తే డేటా నిక్షిప్తం అవ్వదనుకోవడం భ్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం