Balineni: సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా బాలినేని ఫ్లెక్సీ!

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు తెర లేపాయి.

Updated : 07 May 2023 07:54 IST

ఒంగోలులో చర్చకు దారితీసిన ఘటన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు తెర లేపాయి. వేసవి నేపథ్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రకాశం భవన్‌, మార్కెట్‌ సెంటర్‌, రిమ్స్‌ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో శనివారం ప్రారంభింపజేయాలని నిర్ణయించుకున్నారు. వివిధ కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఆయా చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి జగన్‌, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చిత్రాలు లేకపోవడం చర్చకు దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని