Srisaila Devasthanam: నొప్పించకుండా.. తప్పించుకున్నారు!
రాష్ట్రంలో ఆధ్యాత్మిక, దైవ సంబంధ కార్యక్రమం ఏదైనా.. తన నిర్ణయానుసారం జరగాలని కోరుకునే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే పీఠాధిపతి ఒకవైపు.. వందల ఏళ్లుగా విశిష్ఠత కలిగిన ప్రముఖ పీఠం మరోవైపు.. వీరిలో ఎవరిని తక్కువ చేసినా ఇబ్బందే.
చర్చనీయాంశంగా శ్రీశైలం మహా కుంభాభిషేకం వాయిదా
ప్రభుత్వ పెద్దల స్వామీజీ ఆధ్వర్యంలో జరిగేలా ఏర్పాట్లు
దీనిపై కంచి పీఠం అభ్యంతరం?
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక, దైవ సంబంధ కార్యక్రమం ఏదైనా.. తన నిర్ణయానుసారం జరగాలని కోరుకునే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే పీఠాధిపతి ఒకవైపు.. వందల ఏళ్లుగా విశిష్ఠత కలిగిన ప్రముఖ పీఠం మరోవైపు.. వీరిలో ఎవరిని తక్కువ చేసినా ఇబ్బందే. ప్రభుత్వానికి సన్నిహితమైన పీఠాధిపతి ఇటీవలే మహాయజ్ఞం సందర్భంగా కొంత అలక వహిస్తే, ఎలాగోలా ఆయన్ను రప్పించారు. ఈ తరుణంలో శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం ఎందుకని.. ఏకంగా ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి 31 వరకు శ్రీశైలంలో మహారుద్ర శతచండీ సహిత వేదస్వాహాకార పూర్వక మహా కుంభాభిషేకం నిర్వహించాలని ముందే నిర్ణయించారు. గతంలోనే సీఎం జగన్ను కలిసి ఆహ్వానించారు. కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అనూహ్యంగా దీన్ని వాయిదా వేస్తున్నామని, కార్తీకమాసంలో నిర్వహిస్తామంటూ దేవాదాయ కమిషనర్ జారీ చేసిన ప్రకటన అందరినీ విస్తుగొలిపింది. దీనివెనుక ఏం జరిగిందనేది దేవాదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలో ఇటీవల జరిగిన మహాయజ్ఞానికి ఇతర పీఠాధిపతులను పిలవడంపై ప్రభుత్వ పెద్దల కీలకస్వామి కొంత అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చివరి రోజు పూర్ణాహుతికి రావడంపై సందిగ్ధత ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. చివరకు ఎలాగోలా ఆయన్ను రప్పించారు. మహాయజ్ఞానికి కంచి పీఠాధిపతి, తిరుమల పెద్దజీయ్యంగార్, చినజీయర్స్వామి వంటివారు హాజరుకాలేదు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కంచి వెళ్లి, అక్కడి పీఠాధిపతిని కలిసినట్లు సమాచారం. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే స్వామి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం అంటే, తాము రాలేమని వారు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొనడంతో.. చివరకు వాయిదా వేసినట్లు చర్చ జరుగుతోంది. దీనికి వేసవి, వడగాడ్పులు కారణాన్ని సాకులా చూపారని చెబుతున్నారు.
ఆలయ సొమ్ము వృథా
ఇప్పటికే శ్రీశైలంలో యాగం, మహా కుంభాభిషేకం కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ నాలుగు రాజగోపురాలు, స్వామి అమ్మవార్లకు చెందిన రెండు గర్భాలయ విమాన గోపురాలు, ఆలయం లోపల, వెలుపల ఉన్న ఉపాలయాలకు కుంభాభిషేకం కోసం పరంజ ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక యాగ గుండాలు ఏర్పాటుతో పాటు పెద్దఎత్తున ఆహ్వానాలు ముద్రించి అందజేశారు. ఇప్పుడు అర్ధాంతరంగా వాయిదా వేయడంతో ఇవన్నీ వృథాయేనని చెబుతున్నారు. మరోవైపు మహాకుంభాభిషేకం వంటివి ఉత్తరాయణంలో నిర్వహిస్తుంటారని, జూన్ మొదటి వారం తర్వాత ఉత్తరాయణం ముగిసి, దక్షిణాయనం వస్తుందని అటువంటప్పుడు కార్తీకమాసంలో ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అర్చక శిక్షణ అకాడమీ డైరెక్టర్ రాజీనామా
విజయవాడలో జరిగిన మహాయజ్ఞంలో చోటు చేసుకున్న పరిణామాలతో అర్చక శిక్షణ అకాడమీ డైరెక్టర్ వేందాంతం రాజగోపాలచక్రవర్తి తన పదవులకు రాజీనామా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 12న మహాయజ్ఞం ప్రారంభం రోజు సీఎం జగన్ హాజరయ్యారు. అప్పట్లో ఆ పరిసరాల్లోకి రాజగోపాలచక్రవర్తిని రానివ్వలేదు. దీంతో అదే రోజు తాను రాజీనామా చేస్తున్నట్లు వాట్సప్ ద్వారా ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ)కు సందేశం పంపినట్లు సమాచారం. మంత్రి ఆయనకు నచ్చజెప్పి మహాయజ్ఞం ఆయన పర్యవేక్షణలో జరిగేలా చూశారు. మళ్లీ 17న చివరిరోజు పూర్ణాహుతికి సీఎం వచ్చినపుడు కూడా మరోసారి రాజగోపాలచక్రవర్తిని సమీపంలో ఉండనివ్వలేదు. దీంతో 18న ఆయన తన రాజీనామాను లిఖతపూర్వకంగా ఉప ముఖ్యమంత్రికి, దేవాదాయ కమిషనర్కు పంపినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక