రవాణా ఖర్చులు తగ్గించాలి
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి కేంద్రం సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని విస్తృతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరారు.
జీడీపీలో తయారీ, సేవల రంగం వాటాను ప్రపంచస్థాయి సగటుకు తీసుకెళ్లాలి
నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్ నోట్ సమర్పణ
ఈనాడు, దిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి కేంద్రం సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని విస్తృతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరారు. శనివారం ఇక్కడి ప్రగతి మైదాన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో పాల్గొని వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించే నోట్ను సీఎం సమర్పించారు. వివరాలివి.
- ఆర్థిక వ్యవస్థ పురోగతికి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 14శాతం ఉంది. మన దేశ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకమవుతోంది. అమెరికాలో ఈ ఖర్చు 7.5 శాతమే. మనం ఆశించిన ఫలితాలను సాధించాలంటే ఈ ఖర్చులు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశాం. విశాఖలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
* జీడీపీలో తయారీ, సేవలరంగం వాటా 85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుంది. ప్రపంచంలో ఈ రెండు రంగాల సగటు వాటా 91.5% ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ రంగాల వాటా పెంచాలంటే పెట్టుబడులు అవసరం. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి.
* విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2023కు విశేష స్పందన లభించించింది. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకొచ్చాయి. దీనివల్ల దాదాపు 6లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
* ప్రజారోగ్యం, పోషకాహారం చాలా ముఖ్యం. జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే వ్యాధులను నిరోధించాలి.
* నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం మరొక కీలకాంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా ఆ దేశాలు శ్రామికశక్తి కొరతను ఎదుర్కొనబోతున్నాయి. అదృష్టవశాత్తూ మన దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయసున్నవారే ఉన్నారు. ఇది దేశానికి ప్రయోజనకరం. అర్థవంతమైన, క్రియాశీల నైపుణ్యాలను నేర్చుకునేలా మనం పాఠ్యాంశాల్లో కొత్తవి ప్రవేశపెట్టాలి.
* చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నాలుగేళ్లుగా స్థిరంగా ఆర్థికసాయం చేస్తున్నాం.
* మహిళా స్వయంసహాయక సంఘాలపై ఉన్న అధిక అప్పుల భారం వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే సంఘాలకు సున్నా వడ్డీ కార్యక్రమం కింద ప్రభుత్వం గణనీయంగా వడ్డీ రాయితీనిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక