ఏపీ హెచ్ఆర్సీలో టైపిస్టూ లేరు!
కర్నూలులోని ఏపీ మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్ఆర్సీ) సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. విచారణలు పూర్తయి తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు వాయిదా పడిన కేసుల్లో డిక్టేషన్ తీసుకునేందుకు టైపిస్టు, స్టెనోగ్రాఫర్, కోర్టు మాస్టర్ లేరు.
స్టెనోగ్రాఫర్, కోర్టు మాస్టర్ లేని వైనం
స్వయంగా ఉత్తర్వులు సిద్ధం చేస్తున్న ఛైర్పర్సన్
ఈనాడు, అమరావతి: కర్నూలులోని ఏపీ మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్ఆర్సీ) సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. విచారణలు పూర్తయి తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు వాయిదా పడిన కేసుల్లో డిక్టేషన్ తీసుకునేందుకు టైపిస్టు, స్టెనోగ్రాఫర్, కోర్టు మాస్టర్ లేరు. కమిషన్ ఛైర్పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి తానే కంప్యూటర్ ముందు కూర్చుని తుది ఉత్తర్వులను సిద్ధం చేస్తున్నారు. వాయిదా పడిన అన్ని కేసుల్లోనూ ఉత్తర్వులను తయారుచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ ముందుకు వచ్చిన ఓ కేసులో తుది ఉత్తర్వులను సిద్ధం చేయలేకపోతున్నట్లు హెచ్ఆర్సీ పేర్కొంది. వేసవి సెలవులూ వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాయిదా పడిన కేసును మళ్లీ తెరవాలని నిర్ణయించింది. కేసు తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేస్తూ విషయాన్ని ఇరువైపులా న్యాయవాదులకు తెలియజేయాలని హెచ్ఆర్సీ పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. ఏపీహెచ్ఆర్సీ ఛైర్పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యులు డి.సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
పట్టుపట్టి కర్నూలుకు..
వాస్తవానికి అమరావతిలో హెచ్ఆర్సీ ఏర్పాటుకు 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్న హెచ్ఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటుచేసేందుకు తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ 2021లో హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవ్యవస్థ విభాగాలన్నింటిని రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని 2021 ఆగస్టు 26న విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ న్యాయస్థానానికి వివరించారు. 2017నాటి నోటిఫికేషన్ను సవరించి కర్నూలులో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2021 సెప్టెంబరునుంచి కర్నూలులోని ఓ అతిథిగృహంలో హెచ్ఆర్సీని నిర్వహిస్తున్నారు. పట్టుబట్టి కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు కర్నూలులోని హెచ్ఆర్సీ కార్యాలయంలో సౌకర్యాల లేమి, సిబ్బంది కొరతపై దాఖలైన వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.