అమరావతి స్మార్ట్ సిటీకీ తూట్లు
రాజధాని అమరావతిని పూర్తిగా దెబ్బ తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది.
పలు ప్రాజెక్టుల కుదింపు.. నాలుగు రద్దు
ఆ నిధులతో.. సెంటు స్థలాలిచ్చినచోట అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు
కేంద్ర అనుమతి లేకుండా ప్రాజెక్టుల రద్దు నిబంధనలకు విరుద్ధం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిని పూర్తిగా దెబ్బ తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆందోళనల్ని బేఖాతరు చేస్తూ, బృహత్ ప్రణాళికను మార్చేసి.. కొత్తగా ఆర్5 జోన్ సృష్టించి బయటి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి అక్కడ స్థలాలిచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అమరావతి స్మార్ట్సిటీ ప్రాజెక్టులోనూ ఇష్టానుసారం మార్పులు చేసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాజధానిలో ఇదివరకు ప్రతిపాదించిన నాలుగు ప్రాజెక్టులను రద్దు చేసింది. కొన్ని ప్రాజెక్టుల్ని కుదించింది. వాటికి బదులుగా బయటి ప్రాంతాల వారికి స్థలాలిచ్చిన చోట అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల్ని ప్రతిపాదించింది. ప్రాజెక్టును రద్దు చేయగా మిగిలిన నిధుల్ని అక్కడ ఖర్చు చేయబోతోంది. ఈ నెల 1న జరిగిన అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎస్ఎస్సీసీఎల్) బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. కేంద్రం నుంచి ముందుగానే అనుమతి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలపై లబ్ధిదారులకు ప్రస్తుతం హక్కు లేదు. కోర్టు ఉత్తర్వులకు లోబడే వారికి హక్కు దఖలు పడుతుందన్న షరతుతో పట్టాలిచ్చారు. వారికి పట్టాలిచ్చిన చోట పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక వసతులు కల్పించాల్సిందే. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. స్మార్ట్సిటీ ప్రాజెక్టు నిధులతో అక్కడ అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు నిర్మిస్తామని చెప్పడం లబ్ధిదారుల్ని మోసం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రద్దు చేసిన, కుదించిన ప్రాజెక్టులివే!
* అమరావతిలో స్మార్ట్ వార్డ్స్ అభివృద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు, మురుగునీటి శుద్ధి కేంద్రం, పట్టణ క్రీడా కేంద్రాల (టౌన్ స్పోర్ట్స్ హబ్స్) ప్రాజెక్టుల్ని రద్దు చేశారు.
* నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పాఠశాలలు, ఈ-ఆరోగ్య కేంద్రాలు, నీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుల్ని కుదించారు.
* అమరావతి సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రూ.86 కోట్ల నుంచి రూ.37.89 కోట్లకు కుదించారు.
కొత్తగా తీసుకున్న ప్రాజెక్టులివీ!
* కేంద్ర ప్రభుత్వానికి, సీఆర్డీఏకి, ఏఎస్ఎస్సీసీఎల్కి గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రూ.58 కోట్ల నిధుల్ని సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టెయిన్ (సీఐఐటీఐఎస్) కార్యక్రమానికి మళ్లించనున్నారు. ఈ కార్యక్రమం కింద కూడా సెంటు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతాల్లో పాఠశాలలు, ఈ-ఆరోగ్య కేంద్రాలు నిర్మించనున్నారు.
* సెంటు స్థలాలిచ్చిన ప్రాంతాల్లో రూ.27.06 కోట్లతో అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తారు.
ప్రాజెక్టులు రద్దు చేసే అధికారం ఎవరిచ్చారు?
కేంద్ర ప్రభుత్వం 2017లో అమరావతి స్మార్ట్ సిటీ డీపీఆర్కి అనుమతిచ్చి, తన వాటాగా రూ.500 కోట్ల నిధులూ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో రూ.500 కోట్లు సమకూర్చాలి. స్మార్ట్సిటీ ప్రాజెక్టు నిధులతో అక్కడ చేపట్టే ఏ ప్రాజెక్టయినా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలి. ఇది వరకు ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఇష్టానుసారం రద్దు చేస్తాం, కొత్తవి జత చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనడానికి వీల్లేదు. మార్పులు చేసేస్తూ బోర్డు ముందు నిర్ణయం తీసేసుకుని, తర్వాత తీరిగ్గా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తామని చెప్పడానికీ కుదరదు. ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసిన స్మార్ట్ వార్డుల అభివృద్ధి, ఘనవ్యర్థాలు, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల వంటివి కూడా అమరావతికి అత్యంత కీలకమైనవే.
రూ.150 కోట్ల మాటేంటి?: అమరావతి స్మార్ట్ సిటీకి రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన రూ.500 కోట్లను తెదేపా ప్రభుత్వ హయాంలోనే కేటాయించారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ నిధుల్నీ 2022 మార్చి 31లోగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రూ.150 కోట్లు జమ చేయకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.