ఉద్యోగ సంఘాల సిఫార్సు లేఖలను పరిశీలించాలంటూ జీఏడీ ఆదేశాలు

సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసిన సంఘ కార్యవర్గ లేఖల్లో నకిలీలు ఉంటున్నాయని సాధారణ పరిపాలనశాఖ(జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది.

Published : 08 Jun 2023 05:12 IST

ఈనాడు, అమరావతి: సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసిన సంఘ కార్యవర్గ లేఖల్లో నకిలీలు ఉంటున్నాయని సాధారణ పరిపాలనశాఖ(జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిఫార్సు లేఖలను పరిశీలించాలని ఆదేశించింది. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు కోసం ఆఫీస్‌ బేరర్లుగా లేఖలు ఇచ్చిన ఉద్యోగుల వివరాలు తెలియజేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. సర్వీసెస్‌ అసోసియేషన్ల లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని