సీపీఎస్ ఉద్యోగులను మోసగించిన జగన్
మాట తప్పం, మడమ తిప్పం అని పదేపదే చెప్పే సీఎం జగన్... సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి.
ఓపీఎస్ అమలు చేస్తామని.. చేసిందేమిటి?
విశ్వసనీయత అంటే ఇదేనా?
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
ఈనాడు, అమరావతి: మాట తప్పం, మడమ తిప్పం అని పదేపదే చెప్పే సీఎం జగన్... సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని, గత 18 ఏళ్లుగా పాత పింఛను విధానాన్ని అనుసరిస్తున్న పశ్చిమబెంగాల్కు లేని ఇబ్బంది ఏపీకి ఎలా వస్తుందని ప్రశ్నించాయి. సీపీఎస్కు బదులు జీపీఎస్ అమలుచేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు స్పందించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పాత పింఛను పథకం (ఓపీఎస్) అమలుచేయాలని డిమాండు చేశాయి. జగన్ హామీ ఇచ్చిన తర్వాత ఆరు రాష్ట్రాల్లో పాత పింఛనును పునరుద్ధరించారని, ఇక్కడ మాత్రం సాధ్యం కాదనడం ఉద్యోగులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించాయి.
సీపీఎస్ ఉద్యోగుల ఆత్మఘోష చూస్తారు
సీపీఎస్ ఉద్యోగులకు ఇది చీకటి రోజు. వారి ఆత్మఘోష ఎలాంటి రూపం దాలుస్తుందో జగన్ ప్రత్యక్షంగా చూసే రోజు వస్తుంది. గత ప్రభుత్వం నిజాయతీతో తీసుకొచ్చిన పింఛను వద్దనుకొని.. సీఎం జగన్ మోసపూరిత హామీతో నష్టపోయాం. రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులను జగన్ నిలువునా ముంచారు. పాత పింఛను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు జీపీఎస్ పెట్టి అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిస్తే వీధిరౌడీల్లా బైండోవర్ కేసులు పెట్టి, కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు. వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చే పాత పింఛనును ఉద్యోగులకు దూరం చేసి, నిరాశ్రయుల్ని చేయొద్దు.
అప్పలరాజు, పార్థసారథి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీసీపీఎస్ఈఏ
సీపీఎస్ రద్దు కాలేదు
రాష్ట్రంలో సీపీఎస్ రద్దు కాలేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నిలిపివేసి, పీఎఫ్ ఖాతాలు తెరిస్తేనే సీపీఎస్ రద్దు అయినట్లు భావిస్తాం. సీపీఎస్ అమలు చేస్తూనే జీపీఎస్ తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఓపీఎస్ అమలు చేయాల్సిందే. జీపీఎస్ను ఆహ్వానిస్తున్న ఉద్యోగ సంఘాల్లోని సీపీఎస్ ఉద్యోగులందరూ బయటకు రావాలి.
మరియదాస్, అధ్యక్షుడు, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం
జీపీఎస్తో ఉద్యోగికి భద్రత ఉండదు
సీఎం జగన్ హామీ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛను(ఓపీఎస్) విధానమే అమలుచేయాలి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఓపీఎస్ అమలు చేస్తామన్న జగన్ నాలుగేళ్ల తర్వాత కొత్త పథకం ప్రతిపాదించడం ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసింది. మంత్రివర్గ సమావేశంలో జీపీఎస్పై తీసుకున్న నిర్ణయం 3లక్షల మంది ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. ఉద్యోగి పదవీవిరమణ నాటికి ఉన్న మూలవేతనంలో 50% పింఛను, దానిపై డీఆర్ ఇస్తామన్న ప్రతిపాదన విశ్రాంత ఉద్యోగికి భద్రతనివ్వదు.
వెంకటేశ్వర్లు, ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య
సీఎం జగన్ మాట తప్పారు
ఓపీఎస్ అమలుపై సీఎం జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. జీపీఎస్ పేరుతో ఉద్యోగులను మోసం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తామని చెప్పి, అందులో ఇచ్చిన హామీనే తుంగలోకి తొక్కారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేని, షేర్ మార్కెట్ లేని, ఓపీఎస్ను అమలుచేయాలి.
సాయి శ్రీనివాస్, తిమ్మన్న, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రోపాధ్యాయ సంఘం
ఓపీఎస్కు ప్రత్యామ్నాయం లేదు
ప్రతిపక్ష నేతగా జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్ను అమలుచేయాలి. జీపీఎస్ అమలుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఓపీఎస్కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు.
మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్(257)
పోరాటాలతో ఓపీఎస్ సాధిస్తాం
జీపీఎస్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, నాలుగేళ్ల తర్వాత జీపీఎస్ తీసుకురావడం దురదృష్టకరం. ఓపీఎస్కు ఇది ప్రత్యామ్నాయం కాదు. సీపీఎస్, జీపీఎస్లను రద్దుచేయాలి. లేనిపక్షంలో ఐక్య పోరాటాలు చేసి, ఓపీఎస్ సాధించుకుంటాం.
హృదయరాజు, చిరంజీవి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏపీటీఎఫ్
ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకం
ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు ఉద్యోగులందరికీ ఓపీఎస్ను అమలుచేయాలి. కొత్త పథకం ప్రతిపాదించడంతో ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. అనేక రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పింఛను అమలు చేస్తున్నట్లే ఇక్కడా చేయాలి.
ఆస్కార్రావు, బాబాసాహెబ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం
జీపీఎస్పై నమ్మకం లేదు
సీపీఎస్ కింద కాంట్రిబ్యూషన్ను కొనసాగిస్తూ మరోపక్క జీపీఎస్ ఇస్తామనడం ఆమోదయోగ్యం కాదు. ప్రతిపక్షంలో ఇచ్చిన హామీని జగన్ అమలుచేయాలి. జీపీఎస్పై ఉద్యోగులకు నమ్మకం లేదు.
హరికృష్ణ, శ్రీనివాసరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్
ఉద్యోగులను మోసం చేయడమే
జీపీఎస్ ఇస్తామనడం ఉద్యోగులను మోసం చేయడమే. దీనికంటే సీపీఎస్లోనే ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు ఉంది. పదవీవిరమణ చెందేలోగా అవసరాల కోసం మూడుసార్లు పాక్షిక ఉపసంహరణ, పదవీవిరమణ తర్వాత ప్రాన్ ఖాతాలోని మొత్తంలో 60% ఉద్యోగికి వస్తుంది. జీపీఎస్లో ఉద్యోగి వాటా 10% వసూలు చేస్తూ పదవీవిరమణ తర్వాత 60% వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
పాల రామాంజనేయులు, వ్యవస్థాపకుడు, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక