సహకార బ్యాంకులపై సైబర్ వల
సహకార బ్యాంకులపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. వాటిలోని సాంకేతికపరమైన లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము కొల్లగొడుతున్నారు.
సిబ్బంది కంప్యూటర్ ద్వారా సర్వర్లోకి చొరబాటు
ఎంపిక చేసుకున్న ఖాతాల్లోకి సొమ్ము మళ్లింపు
దిల్లీ కాంగ్రా సహకార బ్యాంకు నుంచి రూ.7.79 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
గతంలో హైదరాబాద్లోని బ్యాంకుల్లోనూ ఇదే తరహా లూటీ
ఈనాడు, హైదరాబాద్: సహకార బ్యాంకులపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. వాటిలోని సాంకేతికపరమైన లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము కొల్లగొడుతున్నారు. దేశ రాజధాని దిల్లీలోని కాంగ్రా సహకార బ్యాంకులో ఇటీవల రూ.7.79 కోట్లు కొట్టేశారు. గతంలో హైదరాబాద్లోని రెండు సహకార బ్యాంకుల సర్వర్లలోకి చొరబడి దోచుకున్న తరహాలోనే కాంగ్రా బ్యాంకునూ లూటీ చేశారు.
హైదరాబాద్లో ఏం జరిగిందంటే..
హైదరాబాద్లోని రెండు సహకార బ్యాంకుల నుంచి గతంలో ఆరు నెలల వ్యవధిలోనే రూ.14 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. 2021 జులైలో తెలంగాణ సహకార బ్యాంకు నుంచి రూ.2 కోట్లు, 2022 జనవరిలో ఆంధ్రప్రదేశ్ మహేశ్ సహకార బ్యాంకు నుంచి రూ.12 కోట్లు కొల్లగొట్టారు. రెండింటిలోనూ దాదాపు ఒకే తరహా విధానం అనుసరించారు. తొలుత సిబ్బంది కంప్యూటర్ ద్వారా సర్వర్లోకి ర్యాట్(రిమోట్ యాక్సెస్ టూల్) చొప్పించారు. బ్యాంకు సర్వర్ను తమ అధీనంలోకి తెచ్చుకొని సాఫ్ట్వేర్ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం బ్యాంకు డబ్బును తాము ఎంపిక చేసుకున్న ఖాతాదారుల ఖాతాల్లోకి, అక్కడి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న వందల సంఖ్యలోని ‘మ్యూల్’ ఖాతాల్లోకి మళ్లించి డబ్బు డ్రా చేసుకున్నారు. డబ్బు డ్రా చేసిన ఖాతాల యజమానులను పోలీసులు పట్టుకున్నా అసలు నేరానికి పాల్పడింది ఎవరో ఇప్పటికీ తెలియలేదు.
కాంగ్రాలోనూ ఇదే తీరు..
హైదరాబాద్లోని రెండు సహకార బ్యాంకుల సొమ్మును కొల్లగొట్టినట్లుగానే కాంగ్రా బ్యాంకులోనూ గత నెల మొదటి వారంలో ఇలాంటి మోసానికే సైబర్ నేరగాళ్లు పాల్పడ్డారు. ఈ బ్యాంకు ఖాతాదారులకు స్వయంగా ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేసే అవకాశం లేదు. ఆర్టీజీఎస్ చేయాలంటే బ్యాంకుకు వెళ్లి.. సంబంధిత దరఖాస్తు పత్రం నింపి, ఎవరి ఖాతాలోకి ఎంత డబ్బు బదిలీ చేయాలో రాసివ్వాలి. ఇలా ఖాతాదారులు ఇచ్చిన పత్రాలను కాంగ్రా బ్యాంకు సిబ్బంది రిజర్వు బ్యాంకుకు ఆన్లైన్లో పంపుతారు. అనంతరం రిజర్వు బ్యాంకు సంబంధిత ఖాతాదారుల ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేస్తుంది. ఇందుకోసం కాంగ్రా బ్యాంకు ప్రతి రోజూ రూ.4 కోట్లు ముందుగానే రిజర్వు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఏరోజుకారోజు వచ్చిన వినతుల మేరకు రూ.4 కోట్ల నుంచే నగదు బదిలీ అవుతుంది. మిగతా డబ్బును రిజర్వు బ్యాంకు వెనక్కి పంపుతుంది. దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా కాంగ్రా బ్యాంకుకు పంపుతుంది. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన సైబర్ నేరగాళ్లు తొలుత కాంగ్రా బ్యాంకు సిబ్బంది కంప్యూటర్లోకి చొరబడి.. సర్వర్లోకి ‘ర్యాట్’ను చొప్పించారు. సర్వర్ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కాంగ్రా బ్యాంకు శాఖల నుంచి వచ్చే ఆర్టీజీఎస్ పత్రాల్లాంటివే నకిలీవి సృష్టించారు. వాటిని ఆన్లైన్లో రిజర్వు బ్యాంకుకు పంపారు. ఈ నకిలీ ఆర్టీజీఎస్ పత్రాల ఆధారంగా రిజర్వు బ్యాంకు పంపిన డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించారు.
ఇలా మూడు రోజుల వ్యవధిలో రూ.7.79 కోట్లు కొల్లగొట్టారు. తాము పంపిన పత్రాల్లోని వారికి కాకుండా ఇతరులకు.. ఎక్కువ మొత్తం సొమ్ము బదిలీ అవుతున్నట్లు బ్యాంకు అధికారులు తొలి రోజే గుర్తించారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. మూడు రోజుల తర్వాత అనుమానం వచ్చి ఆర్టీజీఎస్ చెల్లింపులను నిలిపివేశారు. గతంలో సహకార బ్యాంకులను కొల్లగొట్టిన ముఠాయే కాంగ్రా బ్యాంకును లూటీ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత పోలీసులు డబ్బు డ్రా చేసినవారిని గుర్తిస్తున్నారు. అప్పటికే డబ్బు చేతులు మారిఉంటుంది. దాంతో అసలు నేరానికి పాల్పడింది ఎవరన్నది తెలియడం లేదు. ఇప్పటివరకూ దేశంలోని ఏడు సహకార బ్యాంకుల్లో సైబర్ నేరగాళ్లు ఈ తరహాలో రూ.110 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో హైదరాబాద్కు చెందిన మూడు బ్యాంకులు ఉన్నాయి. వీటిలో రెండు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయగా రూ.1.5 కోట్లు పోగొట్టుకున్న ఓ బ్యాంకు తన విశ్వసనీయత దెబ్బతింటుందున్న ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదు. సహకార బ్యాంకుల్లో సైబర్ భద్రత బలహీనంగా ఉంటుందని, ఆర్బీఐ నిబంధనలు సరిగా పాటించడం లేదని గమనించిన సైబర్ నేరగాళ్లు వాటి సర్వర్ను తమ అధీనంలోకి తెచ్చుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో సైబర్ భద్రతపై సహకార బ్యాంకులు దృష్టి సారించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..