సుద్దముక్కకూ దిక్కులేదు!.. ప్రభుత్వ బడి వెలుగుతోందిలా..
పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడి వెలుగుతోంది. ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం.
పాఠశాలల నిర్వహణ నిధులకు జగన్ సర్కారు మంగళం
కేంద్రం ఇచ్చే 60 శాతం వాటా మొత్తాన్నీ దారి మళ్లిస్తున్న వైనం
రిజిస్టర్లు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు ప్రతిబంధకం
సొంత నగదు వెచ్చించి బిల్లుల కోసం ప్రధానోపాధ్యాయుల ఎదురుచూపు
ఈనాడు - అమరావతి
పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడి వెలుగుతోంది. ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోకుండా పోటీపడే పరిస్థితి మొదటి సారిగా రాష్ట్రంలో వచ్చింది
ఈ ఏడాది జూన్ 28న ‘అమ్మఒడి’ నిధులు విడుదల సభలో సీఎం జగన్ మాటలివి..
- తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నిర్వహణకు గత ఏడాది రూ.35 వేలు తన సొంత నిధులు ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని ఇంతవరకు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ పాఠశాలకు నిర్వహణ కోసం రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా.. గత ఏడాది కేవలం రూ.15 వేలు మాత్రమే మంజూరు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వక పోవడంతో రూ.15 వేలు సొంతంగా ఖర్చు చేసి అడ్మిషన్ రిజిస్టర్లు, హాజరు పట్టికలు, సుద్దముక్కలు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు.
- వైఎస్సార్ జిల్లాలోని దొరసానిపల్లి ప్రధానోపాధ్యాయుడు 2021-22 విద్యా సంవత్సరంలో సొంత నగదు రూ.1.04 లక్షలు వ్యయం చేశారు. ఇంతవరకు ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇదే జిల్లాలో శెట్టిపల్లి ప్రధానోపాధ్యాయుడు 2020-21లో రూ.1.15 లక్షలు ఖర్చు చేయగా నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన నిర్వహణ నిధులు సరిపోక పోవడంతో సొంతంగా ఖర్చు చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. గత ఏడాది అరకొరగా నిధులు విడుదల చేయగా.. ఈ సంవత్సరం అసలు మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వ బడుల్లో సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలు ఉపాధ్యాయులకు ప్రతిబంధకంగా మారింది. నిధులు లేక పోవడంతో పలు పాఠశాలల్లో నాలుగైదు నెలలుగా విద్యుత్తు బిల్లులు సైతం చెల్లించడం లేదు. దీంతో విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామంటూ పాఠశాలలకు ఆ శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. పాఠశాలల రోజువారీ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులను ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాది కూడా ఈ నిధులను సక్రమంగా విడుదల చేయలేదు. ప్రభుత్వ బడుల్లో నిర్వహణ నిధులను కేంద్రం సమగ్ర శిక్ష అభియాన్ కింద కేటాయిస్తుంది.దీనికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయాల్సి ఉండగా...కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోంది.
గత ఏడాది 40 శాతమే..
రాష్ట్రంలో పాఠశాలల్లో నిర్వహణ నిధుల కింద ఏటా రూ.122.04 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే 60 శాతం మొత్తాన్నీ ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడేసుకుంటోంది.పాఠశాలల్లో సంస్కరణలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెబుతుండగా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాది ఆగస్టులో 20 శాతం, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 20 శాతం నిధుల విడుదలకు సమగ్ర శిక్ష అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరిలో ఇచ్చిన 20 శాతం నిధులను పలు పాఠశాలల్లో వినియోగించుకోకుండా వెనక్కి తీసేసుకున్నారు.
- 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. రూ.లక్షకు పైగా సొంత నిధులు ఖర్చు చేసిన ప్రధానోపాధ్యాయులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు.
- పురపాలక పాఠశాలలకు గత మూడేళ్లుగా ఈ నిధులు మంజూరు చేయలేదు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)కు బిల్లులు సమర్పించినా మంజూరు చేయలేదు.
నిబంధనలు ఇలా..
పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్ నుంచి ఏటా నిర్వహణ నిధులు విడుదల అవుతాయి.కేంద్రం 60% ఇస్తుండగా.. రాష్ట్రం తన వాటాగా 40% మొత్తాన్ని కలిపి విడుదల చేయాలి.అయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులు కేటాయిస్తారు.30 మంది విద్యార్థులు ఉంటే ప్రాథమిక పాఠశాలలకు రూ.10 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.42 వేల వంతున విడుదల చేయాల్సి ఉంది. 30 నుంచి 100 మంది వరకు విద్యార్థులు ఉంటే అన్ని పాఠశాలలకు రూ.25 వేల వంతున కేటాయిస్తారు. 100 నుంచి 250 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.50 వేలు, 250 నుంచి 1000 మంది వరకు విద్యార్థుల సంఖ్య ఉంటే రూ.75 వేలు విడుదల చేయాలి.వెయ్యి మందికి పైన విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష వరకు ఇవ్వాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు