దిశ చట్టానికి మోక్షం ఎప్పుడు?
తండ్రిలా ఆలోచించి ‘దిశ’ చట్టాలు తెస్తున్నాం. దిశ హత్యాచారం తప్పే అయినా నిందితుల్ని పోలీసులు కాల్చి చంపటమూ తప్పేనని హక్కుల కమిషన్, సుప్రీం కోర్టు కమిటీలు చెబుతాయి. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ, ఏ ప్రభుత్వ పెద్ద ముందుకు రారు.
బిల్లులు ఆమోదం పొంది మూడున్నరేళ్లు
కేంద్రం సమ్మతి సాధనలో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం
31 మంది ఎంపీలున్నా ప్రయోజనం శూన్యం
ఈనాడు - అమరావతి
తండ్రిలా ఆలోచించి ‘దిశ’ చట్టాలు తెస్తున్నాం. దిశ హత్యాచారం తప్పే అయినా నిందితుల్ని పోలీసులు కాల్చి చంపటమూ తప్పేనని హక్కుల కమిషన్, సుప్రీం కోర్టు కమిటీలు చెబుతాయి. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ, ఏ ప్రభుత్వ పెద్ద ముందుకు రారు. తప్పు చేసిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతారు. బాధితుల తల్లిదండ్రులు రోదిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరంగా ఏం చేయగలమనే ఆలోచనల్లోంచే దిశ చట్టం తీసుకొస్తున్నాం.
2019 డిసెంబరు 13న దిశ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి
దిశ చట్టం అమలు కోసం వ్యవస్థలన్నీ సన్నద్ధం కావాలి. దీని అమలుకు ప్రత్యేకంగా ఓ ఐపీఎస్ అధికారిని నియమించాలి.
2019 డిసెంబరు 26న నిర్వహించిన సమావేశంలో జగన్
తానేదో మహిళల రక్షణకు దిగొచ్చిన ఆపద్బాంధవుడిలా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. దిశ బిల్లులు ఆమోదం పొంది మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చట్టం రూపంలోకి తీసుకురాలేదు. అయినా ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు దిశ చట్టం అమలైపోతున్నట్లు, దాని కింద శిక్షలు కూడా పడినట్లు హోరెత్తించారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ, చిత్తశుద్ధి బిల్లులు చట్టరూపం దాల్చేలా చేయటంలో మాత్రం కనబరచలేదు. ఈ బిల్లులు చట్టంగా మారాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం, రాష్ట్రపతి సమ్మతి తప్పనిసరి. వీటిలోని అంశాలపై లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలు, అభ్యంతరాలకు జగన్ ప్రభుత్వం పంపిస్తున్న వివరణల పట్ల కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సంతృప్తి చెందకపోవటంతో అవి ఆమోదానికి నోచుకోవట్లేదు. సరైన మేధోమథనం చేయకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా హడావుడిగా తీసుకురావటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
లోపభూయిష్టంగా ఉందని వెనక్కి..
హైదరాబాద్ శివారులో 2019 నవంబరు 28న ‘దిశ’ హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం దిశ బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ తరహా నేరాల్లో ఏడు రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి.. 21 రోజుల్లో శిక్షలు వేయించేలా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ రెండు బిల్లులు రూపొందించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- క్రిమినల్ లా (ఏపీ సవరణ) బిల్లు-2019, ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019 రాష్ట్ర ఉభయసభల్లో 2019 డిసెంబరు 16 నాటికి ఆమోదం పొందాయి. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.
ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019లో అనేక లోపాలు ఉండటంతో కేంద్రం అప్పట్లోనే దాన్ని తిప్పి పంపింది. మరో బిల్లుపై అభ్యంతరాలు తెలిపింది. దీంతో ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019’ను ఉపసహరించుకుని దాని స్థానంలో 2020 డిసెంబరు 3న ‘ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు-2020’ను రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు.
ఐపీసీకి సవరణలు ఎందుకు?
‘ఐపీసీలో కొన్ని సెక్షన్లు జోడిస్తూ, ప్రస్తుతం నిర్దేశించిన శిక్షల్ని పెంచుతూ బిల్లులో సవరణలు చేశారు. ఇప్పటికే ఉన్న నిర్దేశిత శిక్షల కాలాన్ని ఎలా పెంచుతారు? అవసరమైతే ప్రత్యేక స్థానిక చట్టాలు చేసుకోవచ్చు! ఐపీసీకి సవరణలు ఎందుకు?’ అంటూ కేంద్రం ప్రశ్నలు సంధించింది. ‘ఒక ఘటన జరిగిందని.. బాధితుల పేరుతో చట్టాలు తీసుకురావడం మొదలుపెడితే.. ఐపీసీ మొత్తం పేర్లతోనే నిండిపోతుంది. లైంగిక నేరాల్లో శిక్షపడిన వారి పేర్లతో కాకుండా నిందితులందరి వివరాలతో రిజస్ట్రీ తయారీ అవసరం ఏంటి?’ అని వివరణ అడిగింది. వీటికి ఏపీ ప్రభుత్వ వివరణలు సంతృప్తికరంగా లేకపోవటంతో మూడున్నరేళ్లు అవుతున్నా ఆ బిల్లులు చట్టరూపం దాల్చలేకపోతున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులుందా?
కేంద్ర బిల్లులన్నింటికీ పార్లమెంటులో బేషరతుగా మద్దతిస్తున్న జగన్.. దిశ బిల్లులకు ఎందుకు ఆమోదం పొందలేక పోతున్నారు?
వైకాపాకు లోక్సభ, రాజ్యసభలో 31 మంది ఎంపీలున్నా ఎందుకు దిశ చట్టం రూపం దాల్చడంలేదు?
మూడున్నరేళ్లు దాటినా చట్టం రాలేదంటే.. ఇదేనా మహిళల రక్షణ పట్ల మీకున్న చిత్తశుద్ధి?
కేంద్రం వ్యక్తం చేసిన సందేహాలు నివృత్తి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు?
దిశ చట్టం తేవడానికి జగన్ ప్రభుత్వానికి ఇంకెన్నాళ్లు కావాలి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?