ప్రైవేటు టీచర్లకూ జగన్ దగా!
కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. మన ప్రభుత్వం రాగానే ఏకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకొస్తాం.
ఈఎస్ఐ, కనీస వేతనం, ఆరోగ్య బీమా అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనం
అధికారంలోకి వచ్చాక హామీల తెప్ప తగలేసిన సీఎం
కరోనా సమయంలోనూ కనికరం చూపని ప్రభుత్వం
ఈనాడు, అమరావతి
అంతన్నారు.. ఇంతన్నారు..!
కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. మన ప్రభుత్వం రాగానే ఏకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకొస్తాం. కనీస వేతనం, రెగ్యులర్గా జీతాలు, పని గంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ ఇన్సూరెన్్్స తదితర నియమ, నిబంధనలన్నీ వర్తించే విధంగా ఈ చట్టం ఉంటుంది..
పాదయాత్రలో కృష్ణా జిల్లా దావాజీగూడెం సమీపంలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇది..
ఆకలితో అలమటించినా పట్టించుకోలేదు..
ఎన్నికల ముందు ప్రైవేటు టీచర్లకు ఎన్నో చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఎన్నికల ఏరు దాటాక హామీల తెప్ప తగలేశారు. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి వారి కుటుంబాలు ఆకలితో అలమటించినా జగన్ ఏ మాత్రం కరుణ చూపలేదు. కనీసం రూ.5 వేల చొప్పున సాయం చేయాలని విన్నవించుకున్నా పట్టించుకోలేదు. కనీస వేతనం, పని గంటలు, హెల్త్ ఇన్సూరెన్సు అమలు జగన్ మాటల్లోనే మిగిలిపోయాయి. పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేసినా దీనికి గత ఏడాది అక్టోబరు నుంచి పాలకవర్గమే లేదు.
మాయ మాటలతో ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లను నమ్మించిన జగన్.. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలను అమలు చేసేందుకు నాలుగేళ్లుగా ఒక్క చర్యా తీసుకోలేదు. కొవిడ్-19 సమయంలో ఉపాధి కష్టమై బతుకుదెరువు కోసం వారు తీవ్ర ఇబ్బందులు పడినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి సాయం చేయలేదు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొందరు ఉపాధి కోసం సెక్యూరిటీ గార్డులుగా.. కూలీలుగా.. కరోనా రోగులకు మందులు సరఫరా, హోటల్ నిర్వహణ.. రోడ్డు పక్కన దుస్తుల వ్యాపారులుగా పని చేశారు. ఎంతో కొంత సాయం చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నా సీఎం జగన్ దయచూపలేదు. ఇప్పటి వరకు కనీసం వారి గోడు వినేందుకూ జగన్ సమయాన్ని కేటాయించలేదు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేసినా ఇది ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి పట్టించుకోలేదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంత మంది పనిచేస్తున్నారన్న లెక్కలను సైతం ఇంతవరకు తీసుకోలేదు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు చూస్తే.. ప్రైవేటు విద్యా సంస్థల్లో 3.50 లక్షల మంది పని చేస్తున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోనే 1.70 లక్షల మంది ఉంటారని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న రంగం ఇంకొకటి లేదు. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని గొప్పగా చెప్పే సీఎం జగన్ ప్రైవేటు టీచర్ల విషయంలో మాట తప్పి.. మడమ తిప్పేశారు. వీరి సమస్యను ప్రభుత్వం అసలు ఒక అంశంగా చూస్తున్న పరిస్థితే కనిపించడం లేదు.
పెద్ద బాధ్యత.. ఎన్నో ఇబ్బందులు
ఉపాధ్యాయులుగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన పెద్ద బాధ్యత వారిపై ఉన్నా కొన్నిచోట్ల తక్కువగా జీతాలు ఉంటున్నాయి. వారంలో ఒక్క రోజు సెలవు లభించడమూ కష్టంగా మారుతోంది. ఉదయం పాఠశాలకు వెళ్లింది మొదలు.. సాయంత్రం ఇంటికి వచ్చే వరకు విరామం లేకుండా బోధించాల్సిన పరిస్థితి ఉంటోందని ప్రైవేటు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత లేకుండాపోతోందని, ఏదైనా అనుకోని ఘటన ఎదురైతే కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులు లేదా బీమా అమలు చేయడం లేదు. నవరత్నాల్లో ఇచ్చే వాటినే ఇస్తోంది. కొన్నిచోట్ల పట్టణాల్లో నెలకు రూ.12 వేలు, గ్రామాల్లో నెలకు రూ.10 వేల కంటే ఆదాయం ఎక్కువగా ఉందని పథకాల్లోనూ కోత విధిస్తోంది. ఈ రంగంలో ఎక్కువ మంది ఉండటంతో ఓట్ల కోసం జగన్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. వీటిని నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక ఈ వర్గం వారిని పూర్తి నిర్లక్ష్యం చేశారు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పరిస్థితి లేకవడంతో జగన్ సర్కారు మొద్దునిద్ర నటిస్తోంది.
ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వాలి
ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు ఒక్కటీ పరిష్కరించలేదు. ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వాలి. సెలవులు, పని గంటలు, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేసేలా చూడాలి. సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. మరణించిన ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి.
దిద్దే అంబేద్కర్, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా