చిరుద్యోగుల జీతాల్ని మింగేసిన సర్కారు!
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలకోసారి కూడా జీతాలివ్వడం లేదు.
ప్రకృతి సేద్యం విభాగంలో ఆకలి కేకలు
7 నెలలుగా జీతాలందక 10 వేల మంది వేదన
కేంద్ర నిధుల్ని ప్రభుత్వం వాడేసుకున్న ఫలితం
పాలకొల్లు - న్యూస్టుడే
‘‘ప్రకృతి సాగులో దేశంలోనే మిన్నగా పలు విధానాలు అవలంభిస్తూ మనరాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోంది. క్రమేపీ సాగు విస్తీర్ణం పెరుగుతోంది..’’
గత ఏడాది జరిగిన నీతి ఆయోగ్ సదస్సులో సీఎం జగన్ ప్రత్యేక ప్రసంగమిది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలకోసారి కూడా జీతాలివ్వడం లేదు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఏ జిల్లా చూసినా వందలమంది ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సకాలంలో జీతాలందక ఆకలితో అప్పులు చేసుకుంటూ సంసారాలు నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ప్రకృతి సాగు ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు విడుదలవుతున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల సిబ్బందికి జీతాల ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వీరి జీతాల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తున్నాయి. 2022లో పెండింగ్ ఉన్న జీతాలను 2023 జనవరిలో చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మళ్లీ ప్రకృతి సాగు సిబ్బంది వైపు చూసింది లేదు. ఏడు నెలలుగా జీతం రూపేణా చిల్లిగవ్వ అందక నానా తిప్పలు పడుతున్నామని పలువురు సిబ్బంది వాపోతున్నారు.
రాష్ట్రం దాటి సేవలు..
ప్రకృతి సేద్యంపై ఉన్న ఆసక్తితో రాష్ట్రం దాటి సేవలందిస్తున్నవారు అనేకమంది ఉన్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ నుంచి వచ్చి పనిచేస్తున్న జోనల్ కోఆర్డినేటర్లు 15 మంది ఉన్నారు. అలానే మన రాష్ట్రం నుంచి వెళ్లి మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో కొందరు పనిచేస్తున్నారు. ఆయా రాష్ట్రాలు సకాలంలోనే జీతాలు విడుదల చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో పనిచేసే సుమారు 10 వేల మంది సిబ్బంది జీతాలు అందక అల్లాడుతున్నారు. జీవామృతం తయారీ, కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు విత్తనాల నిమిత్తం అయ్యే ఖర్చులకు గ్రామాల్లో పేద రైతులు ముందుకు రావడం లేదు. వాటిని సైతం డివిజన్ ఇన్ఛార్జీలు, ఐసీఆర్పీలు దుకాణాల్లో అప్పుగా తీసుకొస్తూ కార్యక్రమాలు నిర్వహించాల్సిన దుస్థితి!
2.90 లక్షల హెక్టార్లలో..
రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతుండగా 6.30 లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వీరందరికీ సూచనలు, సలహాలతో సాగు అభివృద్ధికి పనిచేసే సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రకృతి సాగు విస్తీర్ణం పెరిగేదెలాగో పాలకులే చెప్పాలి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరితో ప్రారంభమైన ప్రకృతి సాగు క్రమేపీ ఆయిల్పామ్, జామ, కూరగాయలకు విస్తరించి 42 వేల ఎకరాల్లో కొనసాగుతోంది. 450 మంది వరకు సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 144 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా రూ.44 లక్షల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 330 మంది పని చేస్తుండగా.. వీరికి జనవరి జీతాలు జులైలో అందాయి. ఆ తర్వాతి నుంచి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?