అన్నను మించిన అను‘చోరులు’!
పేదలు అనుభవిస్తున్న ఎసైన్డ్ భూములకు హక్కులన్నారు జగన్.. వెంటనే ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. రూ.కోట్ల విలువైన స్థలాలపై గద్దల్లా వాలిపోయారు. మేం చెప్పిన ధరకే ఇచ్చేయండి.. ధర ఎంతో చెప్పేయండి.. లేదంటే ప్రభుత్వం లాక్కుంటుందని భయభ్రాంతులకు గురిచేశారు.
భూ యాజమాన్య హక్కులపై వైకాపా కపటనాటకం
పేద రైతుల చేజారిన ఎసైన్డ్ స్థలాలు
విలువైన భూములను చౌకగా కొట్టేసిన నేతలు
రూ. కోట్ల భూములకు రూ.లక్షల్లోనే చెల్లింపు
మరో 15 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం!
ఈనాడు,అమరావతి, విశాఖపట్నం
పేదలు అనుభవిస్తున్న ఎసైన్డ్ భూములకు హక్కులన్నారు జగన్.. వెంటనే ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. రూ.కోట్ల విలువైన స్థలాలపై గద్దల్లా వాలిపోయారు. మేం చెప్పిన ధరకే ఇచ్చేయండి.. ధర ఎంతో చెప్పేయండి.. లేదంటే ప్రభుత్వం లాక్కుంటుందని భయభ్రాంతులకు గురిచేశారు. వాటిపై హక్కులు దక్కేలోపే పేదల నుంచి అప్పనంగా లాగేసుకున్నారు!
రాష్ట్రంలో ఇరవై ఏళ్ల క్రితం ఎసైన్డ్ భూములు పొందిన వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని తొలుత సీఎం జగన్ ప్రకటన చేశారు. ఇది అర్హులైన రైతులను ఆనందానికి లోనుచేసింది. అయితే, పైకి చెప్పేదొకటి... లోన చేసేదొకటనే సంగతి ఆ పేదలకు తొలుత అర్థం కాలేదు. ప్రకటనపై జీవో రాకముందే... విలువైన ఆ సాగు భూములపై వైకాపా నాయకులు, కార్యకర్తలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారు. పేద రైతులను బెదిరించి డి-పట్టా భూములను గుప్పిట పట్టారు. వారిని వివిధ రకాలుగా బెదిరించి వాటిని తక్కువ ధరకు దక్కించుకున్నారు. పేద రైతుల స్థానంలో వారే లబ్ధిపొందారు. వారికి ఉన్నతాధికారులు వంతపాడి ఈ కుట్రలో భాగస్వాములయ్యారు.
క్షేత్రస్థాయిలో కనిపించని అనుభవదారులు
తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పేదలకు 29,62,303 ఎకరాల ఎసైన్డ్ భూమిని పంపిణీ చేశారు. ఇందులో 2003కు ముందు పంపిణీ చేసిన 9,94,073 లక్షల ఎకరాలకు, 2003 తర్వాత పంపిణీ చేసిన 3,58,926 ఎకరాలకు సంబంధించిన అనుభవదారులు ఉన్నట్లు తేలింది. 16,589 ఎకరాలపై పరిశీలన జరుగుతోంది. ఏకంగా 15,92,713 ఎకరాలకు సంబంధించి అసలు అనుభవదారులు, వారసులు క్షేత్రస్థాయిలో లేరు. ఈ 15 లక్షల ఎకరాల స్థలాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని ఎసైన్డ్ భూములకు ధరలు పెరగడంతో 70% వరకు చేతులు మారినట్లు అంచనా.
ప్రభుత్వ పెద్దల పన్నాగం
ఎసైన్డ్ స్థలాలను పేద రైతుల నుంచి కాజేసేందుకు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే పెద్దలు పెద్ద స్కెచ్చే వేశారు. ఆయా భూముల క్రయవిక్రయాలకు అవకాశం కల్పిస్తూ వైకాపా సర్కారు చట్ట సవరణ చేసింది. చట్టాన్ని సవరిస్తారన్న సమాచారంపై ఆ పెద్దలకు ముందే ఉప్పందింది. యాజమాన్య హక్కులు కల్పించేందుకు వీలుగా కలెక్టర్లు డీ-నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే వైకాపా నేతలు పేద రైతులపై గద్దల్లా వాలిపోయారు. వారిని బెదిరించి, తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. డీ-నోటిఫికేషన్ వెలువడగానే ఆయా స్థలాలను తమ, తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇలా వైకాపా నాయకులు, వారి అనుచరులు రూ.కోట్లకు పడగలెత్తారు.
భూములివ్వకుంటే హక్కులు దక్కవని..
డి-పట్టా భూముల కుంభకోణం ఉత్తరాంధ్రలో భారీగా జరిగింది. పరిపాలనా రాజధాని పేరిట విశాఖ చుట్టుపక్కల భూములపై, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని డి-పట్టాలపై కన్నేశారు. ‘భూములు ఇవ్వకుంటే మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించబోవు. విమానాశ్రయం, రాజధాని వంటి అవసరాల కోసం ప్రభుత్వం మీ భూములను తీసుకుంటే ఎలాంటి పరిహారం రాదు’ అంటూ అమాయకులను మభ్యపెట్టారు. దాంతో విశాఖ పరిధిలోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, విజయనగరం జిల్లా భోగాపురం, శ్రీకాకుళం పరిధిలో వందల ఎకరాల డి-పట్టాల భూములు చేతులు మారాయి. ఇక్కడ ఎకరానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతున్నా.. రైతులకు మాత్రం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే ముట్టజెప్పినట్లు సమాచారం.
అస్తవ్యస్తంగా వివరాలు
‘హక్కుల కల్పన’కు సంబంధించి ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి భూ రికార్డుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. ప్రతి గ్రామం నుంచి ఎసైన్డ్ భూములు ఎంత విస్తీర్ణంలో, ఎప్పుడు పంపిణీ అయ్యాయి, అవి అనుభవదారులు/వారసుల ఆధీనంలోనే ఉన్నాయా? తదితర వివరాలు సేకరించింది. కొన్నిచోట్ల ఈ భూములు ఆక్రమణకు గురయ్యాయని తేలింది. ఇంకొన్ని గ్రామాల్లో స్థలాలను అనుభవిస్తున్నా.. వారి వద్ద సరైన పత్రాలు లేవు. ఇలా రికార్డులు కనిపించని, అస్తవ్యస్తంగా మారిన భూముల వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఇలాంటి పొరపాట్లు వైకాపా నేతలు, వారి అనుచరులకు వరంగా మారాయి.
చేతులు మారాయి ఇలా..
- ఆనందపురం మండలం కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక తదితర గ్రామాల్లోని 200 ఎకరాల భూములను ఇటీవల విశాఖ కలెక్టర్ డీనోటిఫై చేశారు. ఆయా భూములు రైతుల నుంచి వేరొకరి చేతులు మారుతున్నాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం మండలాల పరిధిలో డీనోటిఫై చేసిన భూముల రిజిస్ట్రేషన్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. డీనోటిఫైలో జాప్యం చేశారన్న కారణంతో విశాఖ జిల్లాలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి.
- రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు 300 ఎకరాల వరకు డి-పట్టా భూములు ఉత్తరాంధ్ర పరిధిలో కొన్నట్లు సమాచారం. వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి మినహాయించే యత్నాలు చేస్తున్నారు.
- భీమిలి పరిధిలోనూ ఓ అధికార పార్టీ నేత.. రైతులకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి రూ. కోట్ల విలువైన 49 ఎకరాల డి-పట్టా భూములను దక్కించుకున్నట్లు తెలిసింది.
- తాడేపల్లిలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు బినామీ పేర్లపై వందల ఎకరాలు హస్తగతం చేసుకున్నట్లు సమాచారం. ఈ భూముల విలువ రూ. కోట్లలో ఉంటే.. రైతులకు మాత్రం రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం.
- అనంతపురం, అనంతపురం గ్రామీణ, రాప్తాడు, కూడేరు మండలాల్లోని భూములు ఎకరాకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతున్నాయి. వైకాపా నాయకులు.. ‘ఎసైన్డ్’ రైతులకు తక్కువ మొత్తంలో చెల్లిస్తూ వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.
- ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్ భూములు దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి ఉదంతాలే జరిగాయి.
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులకు భిన్నంగా...
ఎసైన్డ్ భూములు పొందిన వారిలో ఎస్సీలే కాకుండా ఎస్టీలు, బీసీలు, కొందరు ఓసీలు కూడా ఉన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు ప్రకారం.. ఎసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వాటిని స్వాధీనపరచుకుని తిరిగి పేదలకు గానీ, వారసులకు గానీ అప్పగించాలి. అమ్మకానికి పెట్టిన, రుణాలను చెల్లించలేనప్పుడు వేలానికి పెట్టిన పేదల భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వాటిని భూమిలేని దళితులు/పేదలకు ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?