‘తిరువూరు..’ తాగునీటికీ పోరు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం (ఎస్సీ రిజర్వుడ్) రాజకీయం ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉండటం, ఆ జిల్లాలో ఆంధ్రా ప్రాంతవాసులు అధికంగా ఉండటంతో ఇటు ఏపీతోపాటు అటు తెలంగాణలోనూ ఈ నియోజకవర్గం గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ఎజెండాగా కిడ్నీ బాధితుల సమస్య
ఇరకాటంలో వైకాపా
అయిదేళ్లలో ఎ.కొండూరు మండలంలోనే 250 మందికిపైగా మృత్యువాత
గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా చలనం లేని సర్కారు
జగన్ హామీలను గుర్తు చేస్తున్న ఓటర్లు
ఈనాడు, అమరావతి
- తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారి పక్కన రేకుల షెడ్డులో ఉంటాం. దానికీ ఇంటి పన్ను పేరుతో రూ.250 వసూలు చేస్తున్నారు. నీటి పన్నూ కట్టాలి. ఈ షెడ్డు స్థానంలో ఇంటి నిర్మాణానికి సహకరించమంటే ఎక్కడో ఊరి చివరలో చెరువు వద్ద ఇంటి స్థలమిచ్చారు.
తిరువూరు మండలం సూరంపాలేనికి చెందిన వ్యవసాయ కూలీ ఆవేదన
- మా పొలంలోని మడిలో ఉన్న మట్టిని పక్కన పల్లంలో ఉన్న మరో మడిలోకి తోలుకోవాలంటే గ్రామసచివాలయంలో రూ.2500 చలానా తీయాలి. ఇదేం పద్ధతి? ఇప్పుడు వడ్ల బస్తా ధర రూ.వెయ్యి మాత్రమే ఉంది. ఎరువుల బస్తా ధర దానికి రెట్టింపు. రైతులకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. పోయిన ఎన్నికల సమయంలో వైకాపా గెలుపునకు నిద్రాహారాలు మాని పనిచేశా. ఈసారి ఆలోచనలో పడ్డా.
తిరువూరు మండలం రోలుపడికి చెందిన ఓ యువరైతు వ్యాఖ్య
- ఇసుక కొనలేని పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాల కల్పనా లేదు. ప్రభుత్వ పద్ధతి బాగా లేదు. సర్కారు చేయాల్సిందేమిటి? పరిశ్రమలు స్థాపించాలి. ఉద్యోగాలు కల్పించాలి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పొలాలకు నీళ్లివ్వాలి. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. వీటిల్లో ఏ ఒక్కటైనా చేసిందా?
గంపలగూడెంలోని చెప్పుల వ్యాపారి, మెకానిక్, కూల్ డ్రింక్ షాపు యజమానుల ఆగ్రహమిది.
- మున్సిపాలిటీలో తాగడానికి భూగర్భజలంపై ఆధార పడాల్సి వస్తోంది. కృష్ణా నీటి సరఫరా కోసం రూ.164 కోట్లను గత ప్రభుత్వం మంజూరుచేసి శంకుస్థాపన చేసినా ఈ అయిదేళ్లలోనూ పూర్తి చేయలేకపోయింది.
తిరువూరుకు చెందిన ఓ మెడికల్ షాపు యజమాని ఆవేదన.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం (ఎస్సీ రిజర్వుడ్) రాజకీయం ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉండటం, ఆ జిల్లాలో ఆంధ్రా ప్రాంతవాసులు అధికంగా ఉండటంతో ఇటు ఏపీతోపాటు అటు తెలంగాణలోనూ ఈ నియోజకవర్గం గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎన్డీయే కూటమి పక్షాన తెదేపా నుంచి అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు తొలిసారి బరిలో నిలవగా.. ఇటీవల తెదేపా నుంచి వైకాపాలో చేరిన నల్లగట్ల స్వామిదాస్ ఆ పార్టీ టికెట్ సాధించారు. తెదేపాకు బలమైన కేడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో గత నాలుగుసార్లు గెలుపు దక్కలేదు. అందులో రెండు సార్లు స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపు తప్పింది. ఇక్కడ 2004 నుంచి తెదేపా జెండా ఎగరలేదు. 2004, 2009లలో కాంగ్రెస్, 2014, 2019లలో వైకాపా అభ్యర్థులు గెలిచారు. 2009లో కేవలం 265 ఓట్లు, 2014లో 1676 ఓట్ల తేడాతో తెదేపా ఓటమిపాలైంది. పోయినసారి కూడా 10,835 ఓట్ల వ్యత్యాసంతో తెదేపాకు విజయం దూరమైంది.
2019 ఎన్నికల్లో చిన్నచిన్న పొరపాట్లు, సొంత పార్టీ నేతే వెన్నుపోటు పొడిచారన్న ప్రచారం ఆ పార్టీలో ఉంది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు జెండా ఎగరవేయాలని తెదేపా శ్రేణులు పట్టుదలగా ఉన్నాయి. ఈసారి జనసేన, భాజపా ఓట్లు తమ గెలుపునకు కలిసి వస్తాయని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. గత రెండు మార్లు వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రక్షణనిధికి ఈసారి సీటు దక్కకపోవడంతో ఆయన వైకాపా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియాకుమారి, బీఎస్పీ నుంచి విశ్రాంత అధికారి వందనకుమార్ పోటీలో నిలిచారు. అభ్యర్థులు నలుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి వల్ల తమ ఓటు బ్యాంకుకు గండిపడుతుందన్న ఆందోళనలో వైకాపా ఉంది.
నియోజకవర్గ కేంద్రం తిరువూరు, మండలకేంద్రం గంపలగూడెం, సూరవరం, రాజీవ్నగర్, రోలుపడి, చింతలపాడు, తోటమూల తదితర పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించారు. జగన్ సర్కారుపై వ్యాపార, రైతువర్గాలతోపాటు వ్యవసాయ కూలీల ఆగ్రహం పర్యటనలో కనిపించింది. ప్రగతి పనులు చేయకపోవడం, హామీలను నెరవేర్చకపోవడం, ఇంటి, నీటి పన్నులు భారీగా పెంచడం, విద్యుత్తు ఛార్జీల పెంపు భారం తదితర సమస్యలను అధిక శాతం మంది ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు. సాగునీరే కాదు.. కనీసం తాగునీరు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విసన్నపేట మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయినా వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకుల అండదండలతో ఆ పార్టీ నేతలు తవ్వుతూ ట్రాక్టరు ఇసుకను రూ.5 వేలకు విక్రయిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ భూగర్భజలమే దిక్కు
గ్రామాలకు సైతం రక్షిత నీరు సరఫరా అవుతున్న పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రం, మున్సిపాలిటీ అయిన తిరువూరులో తాగడానికి భూగర్భజలమే ఆధారమవుతోంది. ఇక్కడ తాగునీటి సమస్య పరిష్కారానికి ఫెర్రీ నుంచి తిరువూరు వరకు పైపులైన్ ద్వారా కృష్ణా జలాలను తరలించే పథకానికి 2017లోనే అప్పటి తెదేపా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. 2019లో టెండర్లనూ పిలిచి శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు నిలిచాయి. జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రూ.164 కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించారు. అయిదేళ్ల నుంచి పది శాతమూ పనులవలేదు. నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే పనులు నిలిపేశారు. ఫలితంగా పట్టణవాసుల దాహార్తి అందని ద్రాక్షగానే మిగిలింది. తనను గెలిపిస్తే తిరువూరులో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి మంచినీరు సరఫరా చేస్తామని కూటమి అభ్యర్థి శ్రీనివాసరావు హామీనిస్తున్నారు.
సీఎం కార్యాలయానికి సమీపంలోనే మరో ఉద్దానం
శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారు.. సీఎం కార్యాలయానికి 80 కి.మీ.దూరంలోని తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరులో ఈ సమస్యపైనే కనీసం దృష్టి పెట్టలేదు. ఇక్కడ అయిదేళ్లలో 250 మందికిపైగా కిడ్నీ బాధితులు మృత్యువాతపడ్డారు. వారిలో అత్యధికులు గిరిజనులే. నా ఎస్సీలు ఎస్టీలంటూ గొంతు చించుకుంటున్న సీఎం జగన్.. వారికి రక్షిత నీటిని అందించే ఏ ఒక్క ప్రయత్నమూ చేయలేదు.
భూగర్భజలంలో ఫ్లోరైడ్తోపాటు సిలికాన్ ఎక్కువగా ఉండి 21 గ్రామపంచాయతీల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారమే రెండు వేల మందికిపైగా కిడ్నీ వ్యాధి బారినపడ్డారు. డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నవారూ తక్కువేం కాదు. కిడ్నీ బాధితులందరికీ రూ.10 వేల పింఛను ఇస్తామని ప్రతిపక్ష నేతగా హామీలిచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే కేవలం డయాలసిస్ చేయించుకునే వారికే పింఛను ఇస్తున్నారు. మందులు వాడే వారికి మొండిచేయి చూపారు. పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువుకు దగ్గరవుతున్నారు. ఫలితంగా ఈ నియోజకవర్గం మరో ఉద్దానంలా మారింది. ఫ్లోరైడ్, కిడ్నీ ప్రభావిత గిరిజన గ్రామాలకు కృష్ణా జలాలు అందిస్తామన్న జగన్ హామీ వట్టిదే అయింది.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లేవు... వంతెన లేదు
నియోజకవర్గంలోని 360 చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మార్చి సాగునీటి కొరత లేకుండా చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీలిచ్చారు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేరలేదు. పలు వాగులపై వంతెన నిర్మాణమూ కలగానే మిగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే గంపలగూడెం మండలంలోని కట్లేరు వాగుపై వంతెన లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అయిదేళ్లు నిద్రబోయిన సర్కారు ఇక ఎన్నికలు వస్తున్నాయని ఇటీవల రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చి హడావిడిగా శంకుస్థాపన చేసి చేతులు దులుపుకొంది. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతామని.. స్పెషల్ ఎకనామిక్ జోన్ల ఏర్పాటు, మిర్చి, మామిడి నిల్వలకు శీతల గిడ్డంగుల నిర్మాణం.. ఇలా జగన్ ఇచ్చిన హామీలను ఇప్పుడు ఓటర్లు గుర్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..