శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు

తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్‌ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్‌ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు,

Updated : 23 Apr 2024 07:07 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్‌ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్‌ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బి.సి.జనార్దనరెడ్డి, నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సాక్షి గణపతి ఆలయానికి చేరుకొని పూజలు చేశారు.1.50 గంటలకు చంద్రబాబు దంపతులు హైదరాబాద్‌ బయలుదేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని