Kashi vishwanath Corridor: కాశీలో కొత్త అధ్యాయం
ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని, ఎందరో సుల్తాన్లు పుట్టుకొచ్చినా, మట్టిలో కలిసినా ఈ చారిత్రక నగరం మాత్రం చెక్కుచెదరలేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో రూ.339 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని
దండయాత్రలను తట్టుకున్న కర్మభూమి ఇది
విశ్వనాథుని నడవాను దేశానికి అంకితం చేసిన ప్రధాని
గంగానదిలో స్నానం.. కాలభైరవ దర్శనం
కార్మికులపై పూలరేకులు జల్లి, వారితో భోజనం చేసిన మోదీ
పడవలో విహారం.. గంగా హారతి వీక్షణ
వారణాసిలోని విశ్వనాథ ఆలయ నడవా ప్రారంభోత్సవ సందర్భంగా గంగా జలంతో గుడికి వెళ్తున్న ప్రధాని మోదీ
వారణాసి, ఈనాడు-లఖ్నవూ: ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని, ఎందరో సుల్తాన్లు పుట్టుకొచ్చినా, మట్టిలో కలిసినా ఈ చారిత్రక నగరం మాత్రం చెక్కుచెదరలేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో రూ.339 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని నడవా తొలిదశను సోమవారం ఆయన దేశానికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథ్ మందిర చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం అదృష్టమనీ చెప్పారు. తొలుత గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. కలశంలో గంగాజలం తీసుకువెళ్లి కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాల్లో పూజలు చేశారు. నడవా పనుల్లో పాలుపంచుకున్న కార్మికులపై పూలరేకులు జల్లి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. సాయంత్రం బ్యాటరీ పడవలో విహరిస్తూ నదీ తీరంలో హారతిని వీక్షించారు. ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు.
కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రధాని మోదీ
నాశనం లేని నగరం వారణాసి
‘‘ఎందరో ఆక్రమణదారులు వారణాసిపై దండెత్తారు. ధ్వంసం చేయాలని చూశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, భారత్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ వంటివారు కాశీపై చేసిన కుట్రలు, దురాగతాలను చరిత్ర చెబుతోంది. ఖడ్గం పట్టుకొని.. వారణాసిని, నాగరికతను మార్చేద్దామనుకున్నా, మత మౌఢ్యంతో సంస్కృతిని అణచివేయాలని చూసినా వారికి సాధ్యం కాలేదు. భారతనేల భిన్నమైంది. ఇక్కడ ఔరంగజేబు వస్తే.. అక్కడ మరాఠా యోధుడు శివాజీ పుట్టుకొచ్చాడు. సలార్ మసూద్ మనపైకి దండెత్తితే రాజా సుహెల్దేవ్ మన ఐక్యత బలమేమిటో చాటిచెప్పారు. మన దేశ శక్తి, భక్తి కంటే వినాశకారుల బలం పెద్దది కాదు. కాశీని నాశనం చేద్దామనుకున్నవారు నల్ల పుటలకు పరిమితమైతే కాశీ మాత్రం తన వైభవంపై కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది. సాక్షాత్తూ పరమశివుని రక్షణలో ఉన్న ఈ నగరం.. నాశనం లేనిది’’ అని ప్రధాని చెప్పారు.
సనాతన ధర్మానికి ప్రతీక
కాశీ విశ్వనాథ ధామం ఒక భవనం మాత్రమే కాదని, ఇది సనాతన ధర్మానికి, సంస్కృతికి ప్రతీక అని మోదీ అన్నారు. ‘‘తులసీదాస్- రామచరిత మానస్ను రచించిన ప్రదేశం ఇది. కాశీ విశ్వనాథ ధామం భారతదేశ శక్తికి, చైతన్యానికి చిహ్నం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పురాతన తత్వం, కొత్తదనం రెండూ కనిపిస్తాయి. ఇకపై ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకోవచ్చు’’ అని మోదీ చెప్పారు. ఈ అభివృద్ధి పనులు దేశానికి సరికొత్త దిశ, భవితను చూపిస్తాయని చెప్పారు.
గంగానదిలో ప్రధాని పుణ్యస్నానం
గర్వంగా అనిపిస్తుంది
‘ఇక్కడకు రావడం గర్వంగా అనిపిస్తుంది. కాశీ అందరిది. గంగా అందరిది. విశ్వనాథుడి ఆశీస్సులు అందరివి. స్థలం ఇరుకుగా ఉండడంతో కాశీ విశ్వనాథుడిని, గంగాదేవిని దర్శించుకోవడం కష్టంగా ఉండేది. విశ్వనాథ్ ధామ్ అన్నివిధాలా పూర్తయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం సులభమవుతుంది. 3,000 చదరపు అడుగుల్లో ఉన్న మందిరాన్ని, 5 లక్షల చ.అ.లకు విస్తరించాం. ఇప్పుడు 50 వేల నుంచి 75 వేల మంది మందిరాన్ని దర్శించుకోవచ్చు’ అని మోదీ చెప్పారు. నగరం మార్పు చెందిన ప్రతిసారీ దేశ అదృష్టం కూడా మారుతోందన్నారు. ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హరహర మహాదేవ’ అని ఆయన నినదించారు.
మహాత్ముని కల నెరవేరింది: ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ- మహత్తరమైన కాశీ విశ్వనాథ్ ధామ్ కోసం మహాత్మా గాంధీ కన్న కల మోదీ నాయకత్వంలో సాకారమైందని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం కాశీలో ఇరుకిరుకు వీధులు, మురికి ఆవరించిన పరిస్థితులపై గాంధీ ఆవేదన చెందారని చెప్పారు.
కార్మికులతో కలిసి ప్రధాని భోజనం
కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో మోదీ కలగలిసిపోయారు. సాధారణ పౌరుడిలా వారిమధ్య కూర్చొని భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. కరోనాకు కూడా వెరవక వారు ఏకధాటిగా పనులు కొనసాగించారని ప్రశంసించారు. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంట ఉన్నారు. ఆ తర్వాత.. ఇద్దరూ పడవలో విహరించారు. నడవా పనులను పరిశీలించారు. అంతకుముందు కార్మికులపై పూరేకుల వర్షం కురిపించిన మోదీ.. వారితో కలిసి బృంద చిత్రం తీసుకున్నారు. పర్యటన మధ్యలో ఒకచోట స్థానికుడొకరు ‘పీతాంబరి’ (కాషాయ అంగవస్త్రం) ఇవ్వబోగా ఎస్పీజీ బలగాలు పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశాయి. ఆ వ్యక్తిని గమనించిన మోదీ తన దగ్గరకు పిలిపించి చిరునవ్వుతో నమస్కరిస్తూ దానిని స్వీకరించారు. కాసేపు వారణాసి వీధుల్లోనూ ఆయన నడిచారు. గంగా హారతి సందర్భంగా దీపాల కాంతుల్లో గంగా ఘాట్ మెరిసిపోయింది. యాత్రికుల సౌకర్యం కోసం నిర్మించిన 23 భవనాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.