Navaratnalu:గృహ నిర్మాణాల పూర్తికి గడువు పొడిగింపు
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు.
2022 డిసెంబర్ నుంచి 2023 జూన్కు పెంపు
జిల్లాల్లో యంత్రాంగానికి త్రైమాసిక లక్ష్యాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. మొదటి విడతగా చేపట్టిన 15.75 లక్షల ఇళ్లకు 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేయగా ఈ ఏడాది డిసెంబరు నాటికి వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. 13 లక్షలు గృహాలు పునాది (గ్రౌండింగ్) దశలో ఉన్నాయి. పూర్తయిన ఇళ్ల నిర్మాణ శాతం చాలా తక్కువగా ఉంది. తాజాగా ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేసేందుకు 2023 జూన్ వరకు గడువు పొడిగిస్తూనే జిల్లాల యంత్రాంగానికి త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించింది.
6 దశలుగా విభజన
2022 జనవరి నుంచి మార్చి వరకు 1.18 లక్షల గృహాలు గ్రౌండింగ్ చేయడంతో పాటు 41,520 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. ఆ తర్వాత ఏప్రిల్-జూన్కు 2.74 లక్షల గృహాల గ్రౌండింగ్, 5,19,721 ఇళ్లు పూర్తి చేయాలి. జులై-సెప్టెంబర్ మధ్య 75 వేలు, అక్టోబరు- డిసెంబరు మధ్య లక్ష ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 జనవరి-మార్చి నెలాఖరుకు 3 లక్షలు, అదే ఏడాది ఏప్రిల్-జూన్కు 4,84,075 గృహాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వీటి ప్రకారం జిల్లాల్లో అధికారులు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించారు.
కేంద్రం నుంచి 17 లక్షల ఇళ్లు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన ఇళ్లన్నీ కేంద్రం మంజూరు చేసినవే. ఇప్పటివరకు కేంద్రం 17 లక్షల గృహాలను మంజూరు చేసింది. మరో విడతలో గృహాలు ఇవ్వాలంటే ఇప్పటికే మంజూరు చేసిన వాటిలో 90% గ్రౌండింగ్ చేయడంతో పాటు 70% పూర్తి చేయాల్సి ఉంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకం పూర్తికి కేంద్రం ఈ ఏడాది ఆగస్టు వరకు గడువు నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రెండు విడతలుగా 30 లక్షల గృహాలు పూర్తి చేయాల్సి ఉన్నందున మళ్లీ కేంద్రం నుంచి ఇళ్లు మంజూరు కావాలంటే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఆ మేరకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో నిర్మాణాలు పూర్తికానందున గడువును కేంద్రం పొడిగించే అవకాశం ఉందని రాష్ట్ర గృహనిర్మాణ అధికారులు చెబుతున్నారు. కేంద్రం రూ.2,700 కోట్ల విడుదలకు ఆమోదం తెలపగా, మొదట విడతగా సోమవారం 50% నిధులు రాష్ట్రానికి బదిలీ కానుంది. రాష్ట్ర ఖాతాకు బదిలీ అయ్యాక ఈ మొత్తాన్ని మూడు వారాల్లో రాష్ట్ర నోడల్ అకౌంట్కు (గృహనిర్మాణశాఖ అకౌంట్) ప్రభుత్వం బదిలీ చేయాల్సి ఉంది. అలా కాని పక్షంలో మరో విడత మొత్తాన్ని కేంద్రం విడుదల చేయదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!