Google: ‘గూగుల్ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?’.. పిచాయ్ స్వయంగా సెర్చ్ చేసిన వేళ..!
Google: గూగుల్ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారు. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సెర్చింజన్ అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు గూగుల్ (Google). టెక్నాలజీపై అంతగా అవగాహనలేని వారు ఇంటర్నెట్ అంటే గూగుల్ (Google)లో వెతకడమనే అనుకుంటుంటారు! శోధించడం అనే పదానికి ‘గూగుల్ చేయడం’ పర్యాయపదంగా మారిందంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. అలాంటి గూగుల్ (Google) ప్రారంభమై 25 సంవత్సరాలైంది. ఈ నేపథ్యంలో సీఈఓ సుందర్ పిచాయ్ (Sunder pichai) ఉద్యోగులనుద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. అందులో ఆయన వ్యక్తిగత అనుభవాలతో పాటు గూగుల్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రితో ఎలా కమ్యూనికేట్ చేసేవారో ఈ సందర్భంగా సుందర్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు సమాచారాన్ని క్షణాల్లో ఎలా బదిలీ చేయగలుగుతున్నారో చెప్పారు. ఈ విషయంలో వచ్చిన మార్పులే తరాలు మారుతున్న కొద్దీ వస్తున్న మార్పులకు నిదర్శనమని వివరించారు. ఒకప్పుడు అలవాటు పడటానికి సంవత్సరాలు పట్టిన సాంకేతికత.. నేటి పిల్లలు క్షణాల్లో ఆకళింపు చేసుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లా విన్నవే.. ఇప్పుడు పిల్లల కళ్లముందున్నాయని పిచాయ్ పేర్కొన్నారు.
నల్లా మరమ్మతు నుంచి గూగుల్ ఇంటర్వ్యూ వరకు..
కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక క్రమ పద్ధతిలో అందించాలన్న లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఆలోచనతోనే గూగుల్ మిషన్ ప్రారంభమైందని సుందర్ గుర్తు చేశారు. అలా గూగుల్ సెర్చ్ పేరిట తీసుకొచ్చిన ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పరిష్కారాలను వెతికి పెట్టిందని తెలిపారు. సరైన సమాధానాలు వెతికి పెట్టే గూగుల్ సామర్థ్యాన్ని చూసిన తాను ఆశ్చర్యపోయేవాడినని తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ‘కారుతున్న నల్లాను మరమ్మతు చేయడం ఎలా?’ దగ్గరి నుంచి తాను ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ‘గూగుల్ ఇంటర్వ్యూని ఎదుర్కోవడం ఎలా?’ వరకు అనేక ప్రశ్నలకు గూగుల్ తనకు సమాధానమిచ్చినట్లు తెలిపారు. సమయం గడుస్తున్న కొద్దీ తాను ప్రశ్నలు అడిగిన తీరుతో పాటు గూగుల్ సమాధానం ఇచ్చే విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయని వివరించారు.
అప్పట్లో నిద్ర ‘అనవసరం’ అనుకున్నా..: బిల్ గేట్స్
సమాచారంలో సమానత్వం..
ప్రఖ్యాత యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్కు.. వెనుకబడ్డ దేశంలో ఓ పేద విద్యార్థికీ ఒకే తరహా సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం గూగుల్ వల్లే సాధ్యమైందని పిచాయ్ తెలిపారు. ఈ క్రమంలో చిన్న వ్యాపారాలకు సైతం ప్రకటనల ద్వారా గూగుల్ పెద్ద అవకాశాలను తీసుకొచ్చిందని వివరించారు. ఓ కంపెనీ అందిస్తున్న సేవలు.. ఆ సేవలు అవసరమైన కస్టమర్లను ఒకే వేదిక మీదకు తీసుకురావడం గూగుల్తో సాధ్యమైందని తెలిపారు.
సక్సెస్లే కాదు..
గూగుల్ ఇప్పుడు కేవలం సెర్చ్ బాక్స్ మాత్రమే కాదని సుందర్ తెలిపారు. పదుల సంఖ్యలో గూగుల్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజుకి కోట్లాది మందికి వీటి సేవలు ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో వచ్చిన క్రోమ్, యూట్యూబ్ జ్ఞాన సముపార్జనకు శక్తిమంతమైన వేదికలుగా మారాయని తెలిపారు. టెక్నాలజీ రంగంలో గూగుల్ క్లౌడ్ సృష్టించిన సంచలనాన్ని వివరించారు. అయితే, ఈ 25 ఏళ్ల ప్రయాణంలో అనేక ఆటుపోట్లూ ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కాలేదని వెల్లడించారు. అందుకు గూగుల్వేవ్ను ఉదాహరణగా చెప్పారు.
ఈ ప్రయాణంలో ప్రతిదశలో తమ భవిష్యత్పై కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యేవని సుందర్ తెలిపారు. 2000ల్లో అసలు ఒక వెబ్ బ్రౌజర్గా ఎన్నాళ్లు మనగ్గలమనే ప్రశ్న ఉత్పన్నమైందన్నారు. 2010లో మొబైల్ కంప్యూటింగ్కు అనుగుణంగా సెర్చ్ను మార్చగలమా అనే అనుమానాలు తలెత్తాయని తెలిపారు. కానీ, ప్రతిసారీ బలమైన సమాధానాలు, పరిష్కారాలతో యూజర్ల ముందుకు వచ్చినట్లు వివరించారు.
30ల్లో పదవీ విరమణ ప్రణాళిక..‘టూ ఎర్లీ’ అంటారా? ఇది చదవండి..
అసాధ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే..
అసాధ్యం అనే పదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇతరులెవరూ పరిష్కరించలేని అనేక సమస్యల్ని తాము చేయగలిగామని సుందర్ తెలిపారు. అందుకు ఆండ్రాయిడ్ రూపంలో ప్రతి ఒక్కరి జేబులో కంప్యూటర్ను పెట్టడమే నిదర్శనమని పేర్కొన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సేవల్ని చేరువ చేశామన్నారు. గూగుల్ పిక్సెల్ ద్వారా మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను యూజర్ల దగ్గరకు తీసుకెళ్లగలుగుతున్నామన్నారు. ఇలా ఏఐ, న్యూరల్ నెట్వర్క్స్, డీప్మైండ్, టీపీయూ వంటి అత్యాధునిక సాధనాలు అందుబాటులోకి తీసుకురావడంలో గూగుల్ ముందుందని తెలిపారు.
తొలి నుంచీ బాధ్యతతో..
అనేక రకాల ప్రొడక్ట్లను తీసుకురావడం ఒక సవాలైతే.. యూజర్ల విశ్వాసాన్ని పొందడం అత్యంత ప్రధానమైన విషయమని సుందర్ తెలిపారు. ఈ క్రమంలోనే గూగుల్ మొదటి నుంచీ సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సమాచారం, గోప్యతకు భద్రత కల్పించడాన్ని ప్రాధాన్యంగా ఎంచుకున్నామన్నారు. అలాగే, కృత్రిమ మేధ (Artificial Intelligence) రూపంలో వస్తున్న మరో సాంకేతిక విప్లవానికి ఆరంభంలో ఉన్నామని పిచాయ్ తెలిపారు. వీలైనంత మంది జీవితాలను మెరుగుపర్చే ఉత్పత్తులను అభివృద్ధి చేయాలంటూ 2004లో గూగుల్ వ్యవస్థాపకులు నిర్దేశించిన లక్ష్యాన్నే మళ్లీ పునఃనిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐని ప్రతి ఒక్కరికీ మరింత సహాయకారిగా మార్చడం, దానిని బాధ్యతాయుతంగా అమలు చేయడంమే రాబోయే 10 సంవత్సరాలు ఆపై మన లక్ష్యమని పిచాయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్న.. దాని సమాధానం కోసం చేసే శోధనే రాబోయే 25 సంవత్సరాలలో అసాధారణ సాంకేతిక పురోగతిని అందిస్తుందని పిచాయ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి