Jio-Vodafone Idea: 2జీ, 3జీ సేవలను నిలిపివేయాలని జియో, వొడా ఎందుకు కోరుతున్నాయ్?
jio and VI on 2G: 2జీ, 3జీ నెట్వర్క్ను నిలిపివేయాలని జియో, వొడాఫోన్ ఐడియా కోరుతున్నాయి. ఈ మేరకు ట్రాయ్కు తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమైనప్పటికీ.. 2జీ, 3జీ సర్వీసులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 2జీ నెట్వర్క్పై పనిచేసే ఫీచర్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. దేశీయంగా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 2జీ, 3జీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని జియో (Jio), వొడాఫోన్ ఐడియా (VI) తాజాగా ప్రతిపాదించాయి. ప్రభుత్వమే ఇందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాయ్కు (TRAI) తెలియజేశాయి. ఇంతకీ 2జీ, 3జీ సర్వీసులను
మూసివేయాలని ఈ రెండు కంపెనీలు ఎందుకు కోరుతున్నాయి?
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చి ఏడాది దాటింది. జియో, ఎయిర్టెల్.. 5జీ సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. మరో ప్రైవేటు టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా మాత్రం 5జీ సేవలను ప్రారంభించే విషయంలో ఇంకా ముందడుగు వేయలేదు. బీఎస్ఎన్ఎల్ ఈ విషయంలో చాలా దూరంలో ఉంది. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI).. 5జీ ఎకోసిస్టమ్కు మారేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. దీనిపై జియో, వొడాఫోన్ ఐడియా దాదాపు ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి.
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
2జీ/3జీ సేవలను పూర్తిగా మూసివేయాలని, ఇందుకోసం ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని జియో ట్రాయ్కు తెలిపింది. అప్పుడు 4జీ, 5జీ సర్వీసులకు వినియోగదారులు మారతారని అభిప్రాయం వ్యక్తంచేసింది. అనవసర నెట్వర్క్ వినియోగ భారమూ తగ్గుతుందని పేర్కొంది. దేశంలో 4జీ, 5జీ అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ పాతకాలపు టెక్నాలజీ అయిన 2జీ నెట్వర్క్ను వినియోగిస్తున్నారని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇది పౌరుల మధ్య డిజిటల్ విభజనను తీసుకొస్తోందని తెలిపింది. ఇది 5జీ వృద్ధికి విఘాతమని అభిప్రాయపడింది. ఎయిర్టెల్ మాత్రం దీనిపై తన స్పందనను తెలియజేయలేదు.
సాధ్యమేనా?
వయో వృద్ధులు, పేదలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. వీరంతా 4జీ లేదా 5జీకి మారాలంటే అందుకు తగిన హ్యాండ్సెట్ కొనుగోలు చేయాలి. ఇందుకోసం కనీసం బడ్జెట్ రూ.5 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 2జీ, 3జీ సర్వీసుల మూసివేత సాధ్యమవుతుంది. దీనికి పరిష్కారాన్నీ వొడాఫోన్ తన అభిప్రాయంలో భాగంగా తెలియజేసింది. హ్యాండ్సెట్ కొనుగోలుకు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. అప్పుడే కొత్త టెక్నాలజీని అందుకోవడం సాధ్యమవుతుందని తెలిపింది. రాయితీ కోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF)ను వినియోగించాలని కోరింది. ప్రస్తుతం రూ.77,133 కోట్ల మేర యూఎస్ఓఎఫ్ కార్పస్ ఉంది.
మరోవైపు ‘2జీ ముక్త్ భారత్’ వైపుగా జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తక్కువ ధరకే 4జీ ఆధారిత స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. అయినప్పటికీ ఇంకా 2జీ/3జీ నెట్వర్క్పై ఆధారపడుతున్నవారి సంఖ్య కొనసాగుతోంది. వీరంతా 4జీ లేదా 5జీకి మారాలంటే కొంతకాలం పడుతుంది. టెలికాం కంపెనీలు ప్రతిపాదించినట్లు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా.. అందుకోసం పౌరులకు కొంత గడువు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.