Jio-Vodafone Idea: 2జీ, 3జీ సేవలను నిలిపివేయాలని జియో, వొడా ఎందుకు కోరుతున్నాయ్?
jio and VI on 2G: 2జీ, 3జీ నెట్వర్క్ను నిలిపివేయాలని జియో, వొడాఫోన్ ఐడియా కోరుతున్నాయి. ఈ మేరకు ట్రాయ్కు తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమైనప్పటికీ.. 2జీ, 3జీ సర్వీసులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 2జీ నెట్వర్క్పై పనిచేసే ఫీచర్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. దేశీయంగా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 2జీ, 3జీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని జియో (Jio), వొడాఫోన్ ఐడియా (VI) తాజాగా ప్రతిపాదించాయి. ప్రభుత్వమే ఇందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాయ్కు (TRAI) తెలియజేశాయి. ఇంతకీ 2జీ, 3జీ సర్వీసులను
మూసివేయాలని ఈ రెండు కంపెనీలు ఎందుకు కోరుతున్నాయి?
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చి ఏడాది దాటింది. జియో, ఎయిర్టెల్.. 5జీ సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. మరో ప్రైవేటు టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా మాత్రం 5జీ సేవలను ప్రారంభించే విషయంలో ఇంకా ముందడుగు వేయలేదు. బీఎస్ఎన్ఎల్ ఈ విషయంలో చాలా దూరంలో ఉంది. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI).. 5జీ ఎకోసిస్టమ్కు మారేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. దీనిపై జియో, వొడాఫోన్ ఐడియా దాదాపు ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి.
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
2జీ/3జీ సేవలను పూర్తిగా మూసివేయాలని, ఇందుకోసం ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని జియో ట్రాయ్కు తెలిపింది. అప్పుడు 4జీ, 5జీ సర్వీసులకు వినియోగదారులు మారతారని అభిప్రాయం వ్యక్తంచేసింది. అనవసర నెట్వర్క్ వినియోగ భారమూ తగ్గుతుందని పేర్కొంది. దేశంలో 4జీ, 5జీ అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ పాతకాలపు టెక్నాలజీ అయిన 2జీ నెట్వర్క్ను వినియోగిస్తున్నారని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇది పౌరుల మధ్య డిజిటల్ విభజనను తీసుకొస్తోందని తెలిపింది. ఇది 5జీ వృద్ధికి విఘాతమని అభిప్రాయపడింది. ఎయిర్టెల్ మాత్రం దీనిపై తన స్పందనను తెలియజేయలేదు.
సాధ్యమేనా?
వయో వృద్ధులు, పేదలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. వీరంతా 4జీ లేదా 5జీకి మారాలంటే అందుకు తగిన హ్యాండ్సెట్ కొనుగోలు చేయాలి. ఇందుకోసం కనీసం బడ్జెట్ రూ.5 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 2జీ, 3జీ సర్వీసుల మూసివేత సాధ్యమవుతుంది. దీనికి పరిష్కారాన్నీ వొడాఫోన్ తన అభిప్రాయంలో భాగంగా తెలియజేసింది. హ్యాండ్సెట్ కొనుగోలుకు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. అప్పుడే కొత్త టెక్నాలజీని అందుకోవడం సాధ్యమవుతుందని తెలిపింది. రాయితీ కోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF)ను వినియోగించాలని కోరింది. ప్రస్తుతం రూ.77,133 కోట్ల మేర యూఎస్ఓఎఫ్ కార్పస్ ఉంది.
మరోవైపు ‘2జీ ముక్త్ భారత్’ వైపుగా జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తక్కువ ధరకే 4జీ ఆధారిత స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. అయినప్పటికీ ఇంకా 2జీ/3జీ నెట్వర్క్పై ఆధారపడుతున్నవారి సంఖ్య కొనసాగుతోంది. వీరంతా 4జీ లేదా 5జీకి మారాలంటే కొంతకాలం పడుతుంది. టెలికాం కంపెనీలు ప్రతిపాదించినట్లు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా.. అందుకోసం పౌరులకు కొంత గడువు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి