Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి?
ఇంటర్నెట్ డెస్క్: ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెంటనే మెడికల్ స్టోర్కెళ్లి ట్యాబ్లెట్లు తీసుకొస్తుంటాం. వాటిని వినియోగించేటప్పుడు ఆ మందేమిటి? దాని ధరెంత? ఎప్పటి వరకు పనిచేస్తుంది? వంటి వివరాలు చూస్తుంటాం. ఒకసారి వాటి ప్యాకింగ్ను ఎప్పుడైనా గమనించారా? పిల్, ట్యాబ్లెట్, క్యాప్సుల్.. ఇలా మందు బిల్ల ఏదైనా.. వాటి ప్యాకింగ్ స్టైల్ ఎలా ఉన్నా.. అందుకోసం వాడేది మాత్రం ఒకటే. అదే అల్యూమినియం. ఇంతకీ ఔషధాల ప్యాకింగ్కు దాన్నే ఎందుకు వాడతారు?
శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకోర్చి మందులను తయారుచేస్తుంటారు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే రోగాలు, మహమ్మారులను తరిమికొట్టేందుకు కొత్త కొత్త ఔషధాలను కనుగొంటూ ఉంటారు. ఎంత శ్రద్ధతో వాటిని తయారుచేస్తున్నామో.. రోగికి చేరే వరకు దాని సామర్థ్యం కొనసాగించడమూ అంతే ముఖ్యం. ఒక చోట తయారైన ట్యాబ్లెట్లు.. ఖండాంతరాలు దాటుతున్నాయి. వేర్వేరు వాతావరణ పరిస్థితులను తట్టుకుని రోగుల ప్రాణాలను నిలబెడుతున్నాయి. కొవిడ్ సమయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లను పెద్దఎత్తున అమెరికాకు భారత్ ఎగుమతి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడితో పోల్చితే అక్కడి వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నం. పైగా అంత దూరం తీసుకెళ్లినా ఔషధం ఏమాత్రం చెక్కు చెదరడం లేదంటే దానికి కారణం ప్యాకింగ్. దానికి వాడే మెటీరియల్.
తొలినాళ్లలో..
పిల్స్, ట్యాబ్లెట్ల ప్యాకింగ్ కోసం తొలినాళ్లలో కాగితాన్ని వినియోగించేవారు. దాని స్వభావరీత్యా ఔషధం కలుషితం కాకుండా అది ఏమాత్రం కాపాడలేకపోయేది. తర్వాత పేపర్, పాలిమర్ లేయర్ ప్యాకింగ్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. కొంతకాలం తర్వాత పేపర్కు పీవీసీ లేయర్ కూడా జత అయ్యింది. ఇవేవీ మందులను తేమ నుంచి పూర్తి స్థాయిలో కాపాడలేకపోయాయి. పైగా ఆయా మెటీరియల్కు ఉన్న సాగదీత లక్షణంతో ట్యాబ్లెట్ను బయటకు తీయడమూ కష్టంగా ఉండేది. క్యాప్సుల్స్ ప్యాకింగ్ విషయంలో ఇది మరింత కష్టంగా మారేది. అలా ప్యాకింగ్ మెటీరియల్ విషయంలో ఏళ్ల పాటు శ్రమించాక అల్యూమినియం వాడకం అందుబాటులోకి వచ్చింది. ఏళ్లుగా వీటి ప్యాకింగ్లో కీలక భూమిక పోషిస్తోంది.
అల్యూమినియమే ఎందుకు?
మనిషి జీవితంలో అల్యూమినియం వాడకం ఎప్పటి నుంచో ఉంది. ఇంట్లో దీనితో చేసిన వంట పాత్రలు వినియోగిస్తాం. ఇలా అందరికీ సుపరిచితమైన అల్యూమినియానికి ఉన్న అసాధారణ లక్షణమే ప్యాకింగ్ మెటీరియల్గా మారింది. ఇది తుప్పుపట్టదు. పైగా తేమను, వేడిని తట్టుకునే శక్తి దీని సొంతం. దీంతో ఔషధాలను ప్యాక్ చేయడానికి ఇంతకంటే మించిన మెటీరియల్ లేదని భావించిన ఔషధ పరిశ్రమ.. దీన్ని ప్యాకింగ్కు వాడడం మొదలుపెట్టింది. ఈ ప్యాకేజీ అతినీలలోహిత కిరణాలు, నీటి ఆవిరి, నూనెలు, ఆక్సిజన్, సూక్ష్మజీవుల నుంచి ఔషధాలను దూరంగా ఉంచుతుంది. వాటిని ఏమాత్రం కలుషితం కాకుండా చూస్తుంది. రోగికి చేరేంత వరకు దాని సామర్థ్యాన్నీ కాపాడుతుంది. ఈ కారణంగానే పిల్స్, క్యాప్సుల్స్, ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియం ఏళ్లుగా వినియోగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం