‘నా భర్తను నేనే కాల్చి చంపేదానిని’
కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. దుబే చేసిన దారుణాలపై అతడి భార్య రిచా దుబే తొలిసారిగా మీడియా ముందు స్పందించారు.
గ్యాంగ్స్టర్ వికాస్ దుబే భార్య రిచా దుబే
లఖ్నవూ : కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. దుబే చేసిన దారుణాలపై అతడి భార్య రిచా దుబే తొలిసారిగా మీడియా ముందు స్పందించారు. అతడు చేసిన దారుణాలను ఎప్పటికీ క్షమించలేనని అన్నారు.
‘అతడు ఎనిమిది మంది పోలీసు కుటుంబాలను నాశనం చేశాడు. మేం మా ముఖాలను బహిరంగంగా చూపించలేం. పోలీసుల పట్ల నా భర్త చేసిన దారుణాలకు నేనే అతడిని కాల్చి చంపేదానిని’ అని రిచా దుబే అన్నారు.
ఆ రోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ..‘జులై 3న తెల్లవారుజామున వికాస్ దుబే నాకు ఫోన్ చేశాడు. పోలీసులపై దాడి జరుగుతోందని.. పిల్లలను తీసుకుని బిక్రూ గ్రామాన్ని వదిలివెళ్లాలని కోరాడు. అయితే నేను వీటన్నింటితో విసిగిపోయాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను.’ అని చెప్పారు.
‘వికాస్ పని గురించి, అతడి స్నేహితుల గురించి నాకు చాలా తక్కువ తెలుసు. ఈ ఘటన తర్వాత లఖ్నవూలోని శిథిలమైన భవనంలో ఒక వారం గడిపాను. నేను నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాను. అత్తమామల నుంచి లేదా నా కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభించదని నాకు తెలుసు’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
‘వికాస్ గతంలో ఓ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడి మెదడులో ఏదో సమస్య తలెత్తింది. ఫలితంగా ఎప్పుడూ ఆందోళన, కొపంతో కనిపించేవాడు. దీనికి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే 4 నెలల నుంచి ఆ చికిత్స ఆగిపోయింది. దీంతో అతడిలో కోపం మరింత పెరిగింది.’ అని రిచా వివరించారు.
తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8 మంది పోలీసులను ఒక పథకం ప్రకారం దారుణంగా కాల్చి చంపించిన ఈ గ్యాంగ్స్టర్ను జులై 10న కాన్పుర్ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఇది నకిలీ ఎన్కౌంటర్ అని విపక్షాలు విమర్శించిన నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఏక సభ్య న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?