Crime news: ఇంటికి పిలిచి.. డ్రింక్ ఆఫర్ చేసి.. విద్యార్థినిపై యువకుల దారుణం
బార్క్ ఉద్యోగుల క్వార్టర్స్లో 19 ఏళ్ల విద్యార్థినిపై తెలిసిన వ్యక్తే దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ముంబయి: ముంబయిలో బాబా అటామిక్ రీసెర్చి సెంటర్(BARC) ఉద్యోగుల క్వార్టర్స్లో దారుణం చోటుచేసుకుంది. కళాశాల విద్యార్థిని(19)పై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. చెంబూరు పోస్టల్ కాలనీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తండ్రి బార్క్లో పనిచేస్తుండగా ఆయనకు క్వార్టర్ కేటాయించారు. అయితే, బాధితురాలి తండ్రి విధి నిర్వహణలో భాగంగా వేరే చోటకు వెళ్లారు. నిందితుడి (26) తండ్రి కూడా అదే సంస్థ ఉద్యోగి కావడంతో వీరిద్దరూ ఒకే భవనంలోని వేర్వేరు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. దీంతో ఒకరితో ఒకరికి పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.
బెజవాడలో కార్ల రేసింగ్.. 2 ముక్కలైన స్కూటీలు
అయితే, బుధవారం రాత్రి నిందితుడి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో తన స్నేహితుడిని (30) ఇంటికి ఆహ్వానించాడు. ఆహారం వండుకొనేందుకు ఇండక్షన్ స్టవ్ అవసరం కావడంతో.. తమ ఇంట్లో నుంచి తీసుకురావాలని బాధితురాలిని కోరారు. దీంతో వాటిని తీసుకొని వెళ్లిన విద్యార్థిని.. కాసేపు అక్కడే ఉండి వారితో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ను ఆఫర్ చేశారు. దాన్ని తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో నిందితులిద్దరూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. గురువారం తెల్లవారు జామున ఆమెకు స్పృహ రావడంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకొని విలపించింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు చెంబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
లోన్ యాప్లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక వినీత్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!