బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఎనిమిది మంది మృతి!

బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

Published : 09 May 2024 17:16 IST

శివకాశి: తమిళనాడులోని శివకాశి సమీపంలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు జరగడంతో ఎనిమిది మంది మృత్యువాత పడగా.. 12 మందికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్‌ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో బాణసంచా తయారీకేంద్రంగా శివకాశి ప్రసిద్ధిచెందిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు