48గంటల్లో ₹10కోట్లు ఇవ్వాలన్నారు:సజ్జనార్
నగర శివారు రాజేంద్రనగర్లో పట్టపగలే కిడ్నాప్కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల..
వైద్యుడి కిడ్నాప్ వివరాలు మీడియాకు వెల్లడించిన సీపీ
హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్లో పట్టపగలే కిడ్నాప్కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల నుంచి 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.
‘‘కిడ్నాప్ సూత్రధారి ముస్తఫా.. వైద్యుడు హుస్సేన్కు దగ్గరి బంధువు. ముస్తఫా ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. విలాస జీవితానికి అలవాటుపడిన నిందితుడు డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకున్నాడు. హుస్సేన్కు ముస్తఫా దగ్గరి బంధువు కావడంతో ఆయన్నే కిడ్నాప్ చేయాలని నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారం కిడ్నాప్ చేసేందుకు హుస్సేన్ ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకోవడంతో పాటు రెండు బృందాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక బృందం కిడ్నాప్ చేస్తే.. మరో బృందం బెంగళూరు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించాడు.
నెమ్మదిగా వైద్యుడు హుస్సేన్తో పరిచయం పెంచుకున్నారు. అనుకున్న విధంగా మంగళవారం మధ్యాహ్నం హుస్సేన్ని అతని కారులోనే కిడ్నాప్ చేశారు. కారులో అక్కడనుంచి వైద్యుడిని మొదట కూకట్పల్లి తరలించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న రెండో బృందం హుస్సేన్ని బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 48 గంటల్లోపు రూ. 10 కోట్లు ఇవ్వాల్సిందిగా హుస్సేన్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బెంగళూరు వైపు హుస్సేన్ని తీసుకెళ్తుండగా మంగళవారం రాత్రి అనంతపురం పోలీసులు 44వ జాతీయ రహదారిపై రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించి అదుపులోకి తీసుకున్నారు’’ అని సజ్జనార్ వివరించారు. మొత్తంగా 12 పోలీసు బృందాలు రంగంలోకి దిగి 12 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించినట్లు చెప్పారు. ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులు పూర్తి సహకారం అందించారని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి..
వైద్యుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?