
48గంటల్లో ₹10కోట్లు ఇవ్వాలన్నారు:సజ్జనార్
వైద్యుడి కిడ్నాప్ వివరాలు మీడియాకు వెల్లడించిన సీపీ
హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్లో పట్టపగలే కిడ్నాప్కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల నుంచి 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.
‘‘కిడ్నాప్ సూత్రధారి ముస్తఫా.. వైద్యుడు హుస్సేన్కు దగ్గరి బంధువు. ముస్తఫా ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. విలాస జీవితానికి అలవాటుపడిన నిందితుడు డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకున్నాడు. హుస్సేన్కు ముస్తఫా దగ్గరి బంధువు కావడంతో ఆయన్నే కిడ్నాప్ చేయాలని నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారం కిడ్నాప్ చేసేందుకు హుస్సేన్ ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకోవడంతో పాటు రెండు బృందాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక బృందం కిడ్నాప్ చేస్తే.. మరో బృందం బెంగళూరు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించాడు.
నెమ్మదిగా వైద్యుడు హుస్సేన్తో పరిచయం పెంచుకున్నారు. అనుకున్న విధంగా మంగళవారం మధ్యాహ్నం హుస్సేన్ని అతని కారులోనే కిడ్నాప్ చేశారు. కారులో అక్కడనుంచి వైద్యుడిని మొదట కూకట్పల్లి తరలించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న రెండో బృందం హుస్సేన్ని బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 48 గంటల్లోపు రూ. 10 కోట్లు ఇవ్వాల్సిందిగా హుస్సేన్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బెంగళూరు వైపు హుస్సేన్ని తీసుకెళ్తుండగా మంగళవారం రాత్రి అనంతపురం పోలీసులు 44వ జాతీయ రహదారిపై రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించి అదుపులోకి తీసుకున్నారు’’ అని సజ్జనార్ వివరించారు. మొత్తంగా 12 పోలీసు బృందాలు రంగంలోకి దిగి 12 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించినట్లు చెప్పారు. ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులు పూర్తి సహకారం అందించారని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి..
వైద్యుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: తెలంగాణలో జులై 6 నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు
-
Crime News
Secunderabad violence: కావాలనే నన్ను ఇరికించారు: బెయిల్ పిటిషన్లో సుబ్బారావు
-
Politics News
Revanth Reddy: నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?: రేవంత్
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్ మంత్రుల శాఖలు వెనక్కి
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
-
India News
Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్రౌత్కు ఈడీ నోటీసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?