చిట్యాలలో తుపాకీతో మాజీ మంత్రి హల్‌చల్‌

నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో హల్‌చల్‌ చేశారు

Published : 31 Aug 2020 00:52 IST

చిట్యాల: నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో హల్‌చల్‌ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో పిల్లాయిపల్లి కాలువ పనులను ఆయన అడ్డుకున్నారు. సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా తన భూమి నుంచి కాలువ వెళ్లొద్దంటూ ఇంజినీర్‌, జేసీబీ ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగారు. పనులు నిలిపేయాలంటూ తుపాకీతో వారిని బెదిరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఎస్పీ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. త్వరలో గుత్తా మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని