Bhilwara: కామాంధుల చేతిలో బలైన బిడ్డ.. ఆమె చితివద్దే కుప్పకూలిన తండ్రి!

రాజస్థాన్‌లో ఇటీవల ఓ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హతమార్చి.. మృతదేహాన్ని ఇటుక బట్టీలో కాల్చేశారు. కుమార్తె మృతితో తీవ్ర ఆవేదనకు గురైన తండ్రి.. ఆమె చితివద్దే కుప్పకూలాడు.

Published : 08 Aug 2023 01:52 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో ఇటీవల ఓ 14 ఏళ్ల బాలికను హతమార్చి.. మృతదేహాన్ని ఇటుక బట్టీలో కాల్చేసిన ఘటన దుమారం రేపిన విషయం తెలిసిందే. హత్యకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలిక అవశేషాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కన్నబిడ్డ మరణంతో అప్పటికే తీవ్ర ఆవేదనకు గురైన ఆమె తండ్రికి.. దహన సంస్కారాల సమయంలో దుఃఖం తన్నుకొచ్చింది. గత వారం వరకు తనతోపాటే ఉన్న కుమార్తె.. అంతలోనే చితిమంటల్లో కాలిపోవడం చూసి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వెంటే వచ్చిన కుమార్తె అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ఇటుక బట్టీలో కాలుతూ..!

ఇక్కడి భిల్వాడా జిల్లాలో గతవారం ఓ బాలిక పశువులను మేపేందుకు బయటికెళ్లింది. సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఓ ఇటుక బట్టీ వద్ద కాలిపోయిన స్థితిలో ఆమె శరీర భాగాలు లభించాయి. సమీపంలోనే ఉన్న చెరువులో కూడా కొన్ని శరీర భాగాలు విసిరేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనను అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న స్థానిక ఎస్పీ.. ఒక మహిళ సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని