Crime News : స్టాక్ మార్కెట్ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తానని మోసం చేసి పరారైన ఓ వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
అనేక ఇళ్లు మారుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుణ్ని 27 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వీరేంద్ర ప్రవీణ్ చంద్ర సంఘ్వీ తనను తాను స్టాక్మార్కెట్ నిపుణుడిగా పరిచయం చేసుకొని 1995లో చంద్రభాన్ ఖండేల్వాల్ అనే వ్యక్తి వద్ద రూ.20లక్షలు తీసుకున్నాడు. పెట్టుబడి పెట్టినట్లు నకిలీ రశీదులు అతడికి ఇచ్చి.. నగదుతో వీరేంద్ర ఉడాయించాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వీరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో ఏడాదిన్నర శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వీరేంద్ర కోర్టు వాయిదాలకు వెళ్లడం మానేశాడు. అతని ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు.
తాజాగా ఏసీపీ అనిల్ రోక్డే, ఇతర అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. రికార్డుల్లో నమోదైన అడ్రస్కు వెళ్లి ఆరా తీయగా ఎటువంటి సమాచారం లభించలేదు. దాంతో ముంబయి ఓటర్ల జాబితాను వడపోశారు. వీరేంద్ర ప్రవీణ్ చంద్ర సంఘ్వీ పేరుతో ఒకే ఒక్క ఓటరున్నాడు. అందులో పేర్కొన్న చెంబూరులోని సిద్ధార్థ్ కాలనీలో ఉన్న అతడి ఇంటికి వెళ్లారు. అయితే, వీరేంద్ర ఆ ఇంటిని ఎప్పుడో విక్రయించి వెళ్లాడని తెలిసింది. పోలీసులు పట్టువదలకుండా స్థానికులతో రహస్య సంభాషణలు జరిపి వీరేంద్ర ఫోన్ నంబర్ సేకరించి నిఘా పెట్టారు. ఎట్టకేలకు దానా బందర్లోని వీరేంద్ర నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, దాన్ని కూడా వీరేంద్ర అద్దెకు ఇచ్చి మరో చోట ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అతడిని ఎలాగైనా రప్పించాలని తాము పోలీసులమని చెప్పకుండా విద్యుత్తు అధికారుల్లా ఫోన్ చేశారు. ఇంటి వద్దే చిన్నపాటి వెరిఫికేషన్ ఉందని, వెంటనే రావాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన వీరేంద్ర తాను ప్రతి నెల విద్యుత్తు బిల్లు సక్రమంగా చెల్లిస్తున్నానని, రావాల్సిన అవసరం లేదని కటువుగా బదులిచ్చాడు. దాంతో పోలీసులు వెంటనే ఇక్కడకు రాకుంటే కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరేంద్ర అక్కడకు వెళ్లాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుణ్ని అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!