Suicide: విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు

Updated : 07 Dec 2022 22:27 IST

విజయవాడ: విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని నిజామాబాద్‌ నుంచి పప్పుల సురేష్‌ కుటుంబం ఈ నెల దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌లో ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్‌ పేరుతో కుటుంబం రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున 2.30గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువుకు మెసేజ్‌ పెట్టారు.

అతను స్పందించి సత్రం నిర్వహకులకు ఫోన్‌ చేశాడు. సత్రం సిబ్బంది, నిర్వాహకులు ఈ కుటుంబం ఉన్న రూమ్‌కు వెళ్లి చూడగా తల్లి, కుమారుడు విగతజీవులుగా కనిపించారు. ఆ గదిలో కొన్ని మందులను గుర్తించారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనంతరం పోలీసులకు సమాచారం అందింది. మృతులను పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత(54), పప్పుల అఖిల్‌(28), పప్పుల ఆశిష్‌(22)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని