హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులను....

Updated : 06 Jan 2021 02:50 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులను దుండగులు అపహరించారు. బోయిన్‌పల్లిలోని వారి నివాసానికి ఐటీ అధికారులమంటూ మూడు కార్లలలో వచ్చిన దుండగులు..  ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్‌ను రాయలసీమ ముఠా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రవీణ్‌రావు, అతని సోదరుల కిడ్నాప్‌ ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరాతీశారు. దుండగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దుండగుల కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 

ఇవీ చదవండి..
ముసుగులేసుకొచ్చి కత్తులతో దాడి
108 వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని