మహిళ ఆత్మహత్య.. పక్కింట్లో మరో మహిళ హత్య!

ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్‌లో కలకలం సృష్టించింది.

Updated : 27 Mar 2024 06:02 IST

స్వల్ప వ్యవధిలోనే రెండు ఘటనలు

ధర్మపురి గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్‌లో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కమలాపూర్‌కు చెందిన పులి రేణుక (42) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గీత కార్మికుడైన ఆమె భర్త గంగన్న పని నుంచి ఇంటికి వచ్చేసరికి రేణుక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిసింది. వారింటి పక్కనే ఉండే పులి పద్మ (45) కొద్దిసేపటికే హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసినట్లు కనిపిస్తోంది. కాగా పద్మ హత్యకు గంగన్ననే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా గెట్టు తగాదాలు నడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ధర్మపురి సీఐ రాంనరసింహారెడ్డి, జగిత్యాల రూరల్‌ సీఐ అరీఫ్‌ అలీఖాన్‌ పరిశీలించారు. ఇంకా బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని