ఇసుకాసురుల కాసుల వేటలో.. మరో యువకుడు బలి
వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు.
సీతానగరం, న్యూస్టుడే: వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతానికి చెందిన గోపాల శివశంకర్(21) తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోవడంతో కూలి పనులకు వెళ్తూ తల్లిని పోషిస్తున్నారు.
మంగళవారం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ముగ్గళ్ల గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ నలభై అడుగుల మేర ఇసుక గుంతలు ఉండటంతో శివశంకర్ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం దొరికింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. గత కొంతకాలంగా గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.