సుమోటోగా నల్గొండ ఘటన

నల్గొండ పట్టణానికి చెందిన యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటనను తెలంగాణ మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన ఉన్మాదిని వెంటనే అదుపులోకి

Published : 11 Aug 2022 04:29 IST

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: నల్గొండ పట్టణానికి చెందిన యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటనను తెలంగాణ మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన ఉన్మాదిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి బుధవారం ఆదేశించారు. ప్రేమ పేరిట ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న యువకులను కఠినంగా శిక్షించాలని సూచించారు. కళాశాల స్థాయిలో పిల్లలపై తల్లిదండ్రుల పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని