Cyber fraud: పీఎఫ్ సొమ్ము ఆశ చూపి వృద్ధ దంపతులకు ₹4 కోట్లు టోకరా!
Fraud alert: పీఎఫ్ సొమ్ము ఆశ చూపి ఓ వృద్ధ జంట నుంచి రూ.4 కోట్లు కొట్టేసిన వైనం ఇదీ. ముంబయిలో ఈ ఘటన జరిగింది.
Cyber fraud | ముంబయి: కొంత డబ్బు జమ చేశారంటే పెద్ద మొత్తంలో పీఎఫ్ అందుకోవచ్చంటూ ఓ వృద్ధ జంటకు సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. వారిని మాయ మాటలతో మభ్యపెట్టారు. విడతల వారీగా రూ.4.35 కోట్లు కొట్టేశారు. ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ మధ్య ఈ తంతు కొనసాగింది. తాజాగా ఆ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబయిలోని కఫ్ పరేడ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధ జంట నివసిస్తోంది. వృద్ధురాలి భర్త గతంలోఓ ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం గతంలో చేసిన పెట్టుబడులను ఉపసంహరించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 71 ఏళ్ల వృద్ధురాలికి ఓ రోజు గుర్తు తెలీని మహిళ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఎంప్లాయీస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది. ఆమెను నమ్మించేందుకు భర్తకు సంబంధించిన వివరాలన్నీ చెప్పింది. దీంతో మాట్లాడుతున్న వ్యక్తిని వృద్ధురాలు పూర్తిగా నమ్మింది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసుల మృతి
భర్త పీఎఫ్ ఖాతాలో 20 ఏళ్ల కాలానికి కంపెనీ రూ.4 లక్షలు డిపాజిట్ చేసిందని కాలర్ పేర్కొంది. అది మెచ్యూర్ అయితే రూ.11 కోట్ల మొత్తం వస్తుందని నమ్మబలికింది. ఇందుకోసం టీడీఎస్, జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆమె చెప్పింది నిజమేనని నమ్మి కాల్ చేసిన మహిళ చెప్పినట్లుగా ఓ బ్యాంకు ఖాతాలో ఆ వృద్ధ జంట డబ్బు జమ చేసింది. అలా విడతల వారీగా రూ.4.35 కోట్లు జమ చేశారు. మే నెల నుంచి సెప్టెంబర్ వరకు వేర్వేరు సందర్భాల్లో ఈ తంతు కొనసాగింది.
ఇంకా సొమ్ములు కావాలని కాల్ చేసిన వ్యక్తి డిమాండ్ చేయడంతో తమ దగ్గర లేవని జంట సమాధానమిచ్చింది. అప్పటి వరకు సౌమ్యంగా అడుగుతూ వచ్చిన కాలర్.. తర్వాతి నుంచి ఐటీ శాఖకు సమాచారం ఇస్తామంటూ బెదిరించడం ప్రారంభించింది. ఈ చర్యలతో మోసపోయామని గమనించిన ఆ వృద్ధ జంట పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు ఐపీసీతో పాటు, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
లోన్ యాప్లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక వినీత్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్