Tragedy: గాలిపటం దారం మెడకు చుట్టుకొని కానిస్టేబుల్‌ మృతి

గాలిపటం దారం మెడకు చుట్టుకొని ముంబయిలో ఓ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. 

Published : 25 Dec 2023 02:07 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం దారం మెడకు చుట్టుకోవడంతో ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన  వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వకోలా వంతెన వద్ద చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ సమీర్ సురేష్ జాదవ్ డిండోషి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వర్లిలోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాలిపటం దారం గొంతుకు చుట్టుకొని తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఖేర్వాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని