Crime News: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య!
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతోంది. ఇంటి కోసం ఇంటిల్లిపాదిని ఓ స్నేహితుడు పొట్టన పెట్టుకున్నాడు. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన ప్రసాద్, ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు. ప్రసాద్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోవడంతో బ్యాంకులో రుణం ఇప్పిస్తానని, ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకోవచ్చని ప్రశాంత్ నమ్మించాడు. లోన్ ప్రాసెస్ సులువు అవుతుందని చెప్పి ప్రసాద్ ఇంటిని తన పేరిట రాయించుకున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం రాకపోవడంతో.. ఇంటిని తిరిగి తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్పై ప్రసాద్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఇంటిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో ప్రసాద్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9 నుంచి వారం వ్యవధిలో ఆ కుటుంబం మొత్తాన్ని ఒక్కొక్కరిగా వివిధ చోట్ల హత్య చేశాడు.
వీళ్లిద్దరూ ప్రస్తుతం మాక్లూర్లో ఉండటం లేదు. వివిధ కారణాలతో ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఉంటుండగా.. ప్రశాంత్ నిజామాబాద్ శివారులో ఉంటున్నాడు. హత్య ప్రణాళికను ప్రశాంత్ పక్కాగా అమలు చేశాడు. తొలుత ప్రసాద్ను తన వెంట తీసుకెళ్లి.. డిచ్పల్లి జాతీయ రహదారి పక్కన హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. అప్పులిచ్చిన వారు ప్రసాద్పై ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే పోలీస్స్టేషన్ రావాలని నమ్మించి..అతడి భార్య రమణిని కూడా తన వెంట తీసుకెళ్లాడు. బాసరలోని గోదావరి నది వైపు ఆమెను తీసుకెళ్లి హత్య చేసి.. ఆమెను నదిలో పడేశాడు.
ప్రసాద్, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్ చెల్లిని తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని కనిపించకుండా చేసేశాడు.ప్రసాద్ తల్లికి మాయమాటలు చెప్పి.. అతడి పిల్లలిద్దర్నీ నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దులోని సోన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసి కాల్వలో పడేశాడు. అందులో ఒక మృతదేహం ఈ నెల 8న లభించగా.. సోమవారం మరో మృతదేహం లభ్యమైంది. వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతూ ప్రసాద్ మరో సోదరిని కూడా తీసుకెళ్లి.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లిలో ఇటీవల ఆమెకు నిప్పంటించి చంపేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో ప్రశాంత్ సెల్ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని కూపీ లాగగా.. వరుస హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. మొదటి మూడు హత్యలను తానొక్కడినే చేశానని, ఆ తర్వాతి మూడు హత్యలను తన సోదరుడు, స్నేహితులతో కలిసి చేశానని ప్రశాంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నలుగురు నిందితులు కామారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్