ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో చోటుచేసుకుంది.

Published : 06 May 2024 02:53 IST

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుల ఆంజనేయులు, వనజ దంపతుల చిన్న కుమారుడు లవణ్‌ కుమార్‌ (22) ఏడాది కిందట హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా అక్కడే ఉండేవాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన యువకుడు గత నెల 7న హైదరాబాద్‌ వెళ్లాడు. తిరిగి శనివారం రాత్రి స్వగ్రామానికి వచ్చిన అతను ఇంటికి రాకుండా నేరుగా చెరువు వద్దకు వెళ్లి ద్విచక్రవాహనం, మొబైల్‌ఫోన్‌, ఏటీఎం కార్డులు గట్టుపై పెట్టి అందులో దూకాడు. ఆదివారం ద్విచక్రవాహనం చెరువుగట్టుపై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు. తన కుమారుడు ఉద్యోగం రాదన్న బెంగతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని