TS News: చెరువులో తేలిన చిరుత కళేబరం
చెరువు నీటిలో చిరుత కళేబరం తేలడం మండలంలోని ఖాజాపూరు గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారుల్లో విస్మయం కలిగించింది.
చనిపోయి పడి ఉండటంపై పలు అనుమానాలు
పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: చెరువు నీటిలో చిరుత కళేబరం తేలడం మండలంలోని ఖాజాపూరు గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారుల్లో విస్మయం కలిగించింది. మంగళవారం జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూరు గ్రామ శివారులోని ఉన్న పటేల్ చెరువులో చిరుత కళేబరం తేలి ఉండటాన్ని గమనించిన రైతులు, గ్రామస్థులు విషయాన్ని సర్పంచి నాగమణి దృష్టికి తీసుకురాగా వెంటనే సిబ్బందితో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చిరుత దేహంపై ఎలాంటి గాయాలు లేవని, విషాహారం తినడం వల్లే చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదే విధంగా శరీరంపై ముళ్ల పంది ముళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. స్థానిక పశు వైద్యాధికారి గీతామాలిక శవపరీక్ష నిర్వహించిన అనంతరం అక్కడే దహనం చేశారు. అటవీ శాఖ అధికారి నజియా తబుసుం, సిబ్బంది కృష్ణా గౌడ్, గబ్బర్సింగ్ ఉన్నారు. ఏడాది కాలంగా మండల పరిధిలోని కామారం, మీర్జాపల్లి, కామారం తండా, చేగుంట మండలం వల్లూరు అటవీ ప్రాంతాల్లో నాలుగు చిరుతపులులు సంచరిస్తుండగా ఖాజాపూర్, చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా తిరిగినట్లు ఆనవాళ్లు లేవు. తాజాగా చిరుత ఖాజాపూర్ చెరువులో చనిపోయి పడి ఉండటంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!