Guntur: ఇసుక రీచ్‌ వద్ద దాడి.. ఇరువర్గాలపై కేసు నమోదు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో ఇసుక రీచ్‌లో దాడికి పాల్పడిన ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి.

Published : 30 Mar 2024 12:06 IST

కొల్లిపర: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో ఇసుక రీచ్‌లో దాడికి పాల్పడిన ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఎస్సై ఆర్‌.రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి మున్నంగి వాగులో ఇసుక  తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని నిరసన వ్యక్తం చేసిన వారిపై వైకాపా నేతలు, ఇసుక మాఫియా సాగిస్తున్న పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో మున్నంగి గ్రామానికి చెందిన వేమూరి బాలరాజు, వేమూరి అశోక్‌, కొండూరి మహేశ్‌, వేమూరి మహేశ్‌, మోజేశ్‌కు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం తెనాలి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుడు వేమూరి అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇసుక మాఫియాకు చెందిన వారు.. తాము కూడా గాయపడ్డామని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని